ఓ టీచర్ దారుణానికి తెగబడింది. తన దగ్గర చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులను ఇంటికి పిలిపించి..వారితో ఒకేసారి శృంగారం చేసింది. దీంతో ఆగకుండా.. ఆ బాగోతాన్ని వీడియో తీయించి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయించింది.
చెన్నై : tamilnaduలోఓ గవర్నమెంట్ టీచర్ చేసిన పని సంచలనంగా మారింది. ముగ్గురు విద్యార్థులతో శారీరకంగా కలవడం ఉండాలని video తీసి వైరల్ చేసిన ఘటన పెను దుమారం రేపింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే ఘటన కావడంతో స్వయంగా తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.
మధురైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంది సదరు టీచర్ (42). ఈ క్రమంలో ఓ రోజు ముగ్గురు విద్యార్థులను ఇంటికి పిలిపించుకుని వారితో శారీరకంగా కలిసింది. ఈ తతంగాన్ని 39 ఏళ్ల వయసున్న ఆమె ప్రియుడు, స్థానిక వ్యాపారవేత్త అయిన ఒకరు వీడియో తీశాడు. ఆపై ఆ వీడియోను తన స్నేహితుల సహాయంతో వాట్స్అప్ ద్వారా సర్క్యులేట్ చేశాడు.
వీడియో వ్యవహారం పోలీసుల దృష్టికి చేరడంతో తమిళనాడు డిజిపి కార్యాలయం స్పందించింది. తక్షణమే ఆ వీడియోను తొలగించే ప్రయత్నాలు చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై టీచర్, ఆమె ప్రియుడిని మదురై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
భర్త నుంచి విడిపోయిన సదరు మహిళ 2010 నుంచి సదరు వ్యాపారవేత్తతో సహజీవనం చేస్తోంది. కేవలం వైరల్ కావడం కోసమే ఆ వీడియో తీశారా? లేదంటే అశ్లీల సైట్లో అప్లోడ్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? బ్లాక్ మెయిలింగ్ కోణం ఉందా? అనేది సైబర్ విభాగం తేల్చాల్సి ఉంది. వీడియోను ఎవరికి పంపారు? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.మరోవైపు ఆ ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు సదరు టీచర్ పై ఆమె ప్రియుడిపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనితో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటన నిరుడు జూన్ లో హర్యానాలో చోటు చేసుకుంది. పంజాబ్, హర్యానాలో ఓ ట్యూషన్ టీచర్ టీనేజ్ విద్యార్థితో పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెడితే.. పానిపట్ కు చెందిన ఓ కుటుంబం, తమ 17యేళ్ల కొడుకుకు ట్యూషన్ చెప్పడానికి 20యేళ్ల వయసున్న మహిళా టీచర్ ను నియమించారు.
గత మూడు నెలలుగా ఆమె ప్రతిరోజూ ఇంటికి వచ్చి అతడికి ట్యూషన్ చెబుతుంది. రోజూ నాలుగు గంటలపాటు ట్యూషన్ సాగుతుంది. ఈ క్రమంలో 2021, మే 29న ఆ అబ్బాయి ఇంటికి దగ్గర్లో ఉన్న దేస్రాజ్ కాలనీలో ఉండే ట్యూషన్ టీచర్ ఇంటికి వెడుతున్నానని చెప్పి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. కొడుకుకు ఫోన్ చేస్తే స్విఛాప్ వస్తుంది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కంగారుగా ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లారు. అక్కడ కొడుకు కోసం వాకబు చేస్తే.. తమ కొడుకే కాదు వాళ్ల కూతురైన సదరు టీచర్ కూడా కనిపించడం లేదని తెలిసింది.
టీచర్ తల్లిదండ్రులు తమ కూతురు కూడా కనిపించడంలేదంటూ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆ టీచర్ మీద మైనర్ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ టీచర్ మీద కిడ్నాప్ కేసు నమోదు చేశామని, వారికోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి రాణా ప్రతాప్ తెలిపారు. అయితే ఆ టీచర్ కు ఇదివరకే పెళ్లవగా విడాకులు కూడా తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే వీరిద్దరూ ఇంట్లోనుంచి వెళ్లేటప్పుడు ఎలాంటి విలువైన వస్తువులు తీసుకువెళ్లలేదని పోలీసులు తెలిపారు.