వారు నాపై క్షిపణులను ప్రయోగించారు.. గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీపై గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కాంగ్రెస్ పార్టీ నేతలు క్షిపణులను ప్రయోగించారనీ, తాను 303 రైఫిల్తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నానని అన్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాటి నుంచి పార్టీపై విమర్శల దాడి చేస్తునే ఉన్నారు. తాజాగా మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తనపై క్షిపణులు ప్రయోగిస్తున్నారనీ, అయితే.. తాను మాత్రం రైఫిల్తో వాటిని నాశనం చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గురువారం జమ్మూ కాశ్మీర్లోని భదర్వాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆజాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాపై క్షిపణులను ప్రయోగించింది. నేను 303 రైఫిల్తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాను. వాటిని ధ్వంసం చేశారు. నేను బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగిస్తే ఏమి జరిగేది? అందరూ అదృశ్యం కావాలి."అని విమర్శించారు. పరోక్షంగా సోనియా, రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేశారు.
ఇదిలాఉంటే.. తాను దివంగత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై ఎలాంటి విమర్శలు చేయననీ అన్నారు. 52 ఏళ్లుగా పార్టీలో సభ్యుడిగా ఉండి.. వివిధ పదవులను అలకరించానని అన్నారు. రాజీవ్గాంధీని సోదరుడిగా, ఇందిరాగాంధీని నా తల్లిగా భావించననీ, వారిపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేయాలనే ఉద్దేశం తనకు లేదని పేర్కోన్నారు.
కాంగ్రెస్ను విడిచిపెట్టిన తర్వాత.. ఆయన జమ్మూలో ఏర్పాటు చేసిన మొదటి బహిరంగ సభలో మాట్లాడుతూ.. పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణపై దృష్టి సారించే.. సొంత రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.తాను ఇంకా పార్టీకి పేరు నిర్ణయించలేదనీ, జమ్మూ కాశ్మీర్ ప్రజలే తన పార్టీకి పేరు, జెండాను నిర్ణయిస్తారని పేర్కోన్నారు. తన పార్టీ పేరును ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా హిందూస్థానీ పేరు పెడతానని ఆయన అన్నారు.
ఆజాద్ 2005-2008 కాలంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన ఆగస్టు 26న కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. గత తొమ్మిదేళ్లలో పార్టీని నడిపిన తీరుపై ఆయన పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను సోనియా గాంధీకి అందించారు. తాను చాలా విచారం, అత్యంత లీనమైన హృదయంతో రాజీనామాను సమర్పిస్తున్నానని, కాంగ్రెస్తో తన 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని ఆజాద్ చెప్పారు. అంతకుముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.