Asianet News TeluguAsianet News Telugu

దారుణం: తండ్రి మృతితో వీధిన పడ్డ 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

మహారాష్ట్రలోని వాసాయిలో దారుణమైన సంఘటన జరిగింది. తండ్రి మరణంతో గూడు లేక వీధిన పడిన బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా విడివిడిగా లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చారు.

Girl molested by three men on street of bvasai in Maharshtra
Author
Vasai, First Published Aug 29, 2021, 8:19 AM IST

పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘాయి జిల్లా వాసాయిలో దారుణమైన సంఘటన జరిగింది. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు బాలికపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా 2020 నవంబర్, ఈ ఏడాది ఆగస్టు మధ్య విడివిడిగా పలు మార్లు లైంగిక దాడికి పాల్పడడారు. 

తల్లి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లడంతో బాలిక తన తండ్రితో ఓ అద్దె ఇంట్లో ఉంటూ వచ్చింది. నిరుడు నవంబర్ లో తండ్రి మరణించాడు. దాంతో ఇల్లు ఖాళీ చేయాలని యజమాని బాలికకు చెప్పాడు. చేసేది లేక బాలిక వాసాయిలోని  ఫుట్ పాత్ మీద నివసిస్తూ వస్తోంది. 

వాసాయి రైల్వే స్టేషన్ ప్రాంతంలో బాలిక ఆగస్టు 3వ తేదీన దిక్కు తోచని రీతిలో తిరుగుతుండడాన్ని పోలీసు బృందం గుర్తించింది. దాంతో ఆమెను ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే సరిగా సమాధానం చెప్పలేకపోయింది. బాలిక ఒక రకమైన వేదనతో ఉన్నట్లు కనిపించింది. దాంతో పోలీసులు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సాయంతో పాటు కొన్ని ఎన్డీవోల సాయం తీసుకున్నారు 

బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. ఆమె లైంగిక దాడికి గురైనట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దానిపై ప్రశ్నించగా ఆమె అజయ్ అనే పేరు మాత్రం చెప్పగలిగింది. దాన్ని బట్టి పోలీసులు దర్యాప్తు సాగించారు. ఈ నేపథ్యంలో బాలిక సమాచారం ఇవ్వడం ప్రారంభించింది. తన పరిస్థితి గురించి చెప్పింది. వీధుల్లో తిరుగుతూ ఫుట్ పాత్ ల మీద జీవిస్తూ వస్తున్న క్రమంలో తాను లైంగిక దాడికి గురైన విషయాన్ని వివరించింది. 

పోలీసు బృందాలు కేసును దర్యాప్తు సాగించాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. చివరకు ఆగస్టు 10వ తేదీన ప్రధాన నిందితుడు అజయ్ కుమార్ వినోద్ జైస్వాల్ (34)ను పోలీసులు పట్టుకోగలిగారు. అతను మిగతా ఇద్దరి పేర్లను కూడా చెప్పాడు. దాంతో పోలీసులు మరో ఇద్దరు నిందితులు మున్నా యాదవ్ (28), అక్రమ్ చౌదరి (34)లను అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios