దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ‘‘ఫ్రమ్ ది ఇండియా గేట్’’ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ అడుగు వేసినా ఇబ్బందే..
కేరళలోని అధికార వామపక్ష ప్రభుత్వంలో (ఎల్డీఎఫ్)అపూర్వమైన సంక్షోభం ఏర్పడింది. జేడీఎస్ అధినేత దేవెగౌడ ఎన్డీఏతో చేతులు కలపడంతో.. కర్ణాటకలోని రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎల్డీఎఫ్ డైలమాలో పడింది. ఎందుకంటే.. కేరళలో జేడీఎస్ పార్టీ లెఫ్ట్ ఫ్రంట్లో భాగంగా ఉంది. కేరళ కేబినెట్లో విద్యుత్ మంత్రిత్వ శాఖను బాధ్యతలు చూస్తున్న కె కృష్ణన్ కుట్టి.. జేడీఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్ణాటకలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో.. కేరళలో ఎల్డీఎఫ్ను ఢీకొట్టే అవకాశాన్ని కాంగ్రెస్ తొలిసారిగా చేజిక్కించుకుంది. కేరళలో ప్రస్తుతం ఎల్డీఎఫ్-ఎన్డీఏ ప్రభుత్వం ఉందని వారు విమర్శించడం మొదలుపెట్టారు.
అయితే ఈ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియక.. జేడీఎస్కు ఎల్డీఎఫ్ అల్టిమేటం ఇచ్చింది. జేడీఎస్ తన రాజకీయ వైఖరిని బహిరంగంగా ప్రకటించాలని.. వామపక్షాలను ఇబ్బంది నుంచి కాపాడాలని ఎల్డీఎఫ్ కోరింది. మరోవైపు కేరళలో జేడీఎస్ రాష్ట్ర వర్గానికి లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ)తో విలీనం వంటి చాలా తక్కువ ఎంపికలు మిగిలి ఉన్నాయి. ఇది కుదరకపోతే.. కేరళ జేడీఎస్ యూనిట్ పార్టీతో వేరుపడి కొత్త సంస్థగా పేరు మార్చుకోవాలి.
కో-ఆపరేటివ్ గ్రాఫ్ట్ ఐఎన్సీ..
మనీలాండరింగ్కు సహకార బ్యాంకు మార్గాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్న సందర్భాన్ని కేరళ చూస్తోంది. కరివన్నూరు సహకార బ్యాంకు కుంభకోణం బంధం ఎంత లోతుగా నడుస్తుందో బట్టబయలు అయింది. సీనియర్ కామ్రేడ్ ఏసీ మొయిదీన్ సన్నిహితుల్లో ఒకరు ఈడీ కస్టడీలో ఉన్నారు. మరికొందరు పార్టీ అగ్రనేతలు దర్యాప్తు సంస్థ రాడార్లో ఉన్నారు. వారిలో కొందరు కొన్ని సార్లు ప్రశ్నించబడ్డారు.
అయితే ఇక్కడ ఆశ్చర్యకం కలిగించే విషయం ఏమిటంటే.. డబ్బు కోల్పోయిన డిపాజిటర్లు కూడా పార్టీ సభ్యులే పాపం. ఈ పరిస్థితిని పరిష్కరించే ఉద్దేశ్యంతో.. కేరళ బ్యాంక్ (అన్ని సహకార బ్యాంకులను కవర్ చేసేది).. కరువనూరు బ్యాంకుకు తన డిపాజిటర్లకు తిరిగి చెల్లించడానికి త్వరలో 100 కోట్ల రూపాయల రుణాన్ని ఇవ్వనుంది. అయితే డిపాజిటర్లు ఎవరూ తమ పార్టీ నేతలను క్షమించే పరిస్థితి లేదు. తమ డిపాజిట్లు తిరిగిచ్చినా ఈసారి ఏ నాయకుడుని శిక్ష నుంచి తప్పించుకోనివ్వమని చెబుతున్నారు.
ఇన్ ది ఫేస్ ఆఫ్..
ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో ఒక రాజకీయ నాయకుడికి సంబంధం లేకుండా పోవడం కంటే.. అతనికి అవమానకరం మరొకటి లేదు. జైపూర్లోని కాస్మోపాలిటన్ క్లబ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు అని భావించే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దారుణమైన షాక్కు గురయ్యారు. ఆ అగ్రనేతకు సీఎం కార్యాలయం నుంచి వ్యక్తిగత ఆహ్వానం కూడా వచ్చింది. కార్యక్రమంలో సీఎంతో కలిసి రిబ్బన్ కట్ చేసిన పలువురు నేతలలో ఆయన కూడా ఉన్నారు.
అయితే ఆ ఈవెంట్ పోస్టర్ల వైపు చూసిన సమయంలో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోస్టర్లలో ఎక్కడా కూడా తన ముఖాన్ని గుర్తించలేకపోయారు.. దీంతో అందులోని నేతల ముఖాలు అతడిని చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. అక్కడికి హాజరైన వీఐపీల జాబితా నుంచి ఆయన పేరు మాత్రం లేకుండా పోయింది. దీనిని జీర్ణించుకోవడం ఆ నాయకుడిని చాలా కష్టంగా మారింది. దీంతో ఆయన కోపంతో, నిశ్శబ్దంగా వేదిక నుంచి వెళ్లిపోయారు. అయితే ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా? లేదా అనుకోకుండా జరిగిందా? అనేది అస్పష్టంగానే ఉంది.
తమిళనాడులో ‘‘పార్టీ’’ సమయం..
తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు తెగిపోవడంతో ఆ రాష్ట్రంలో భారీ రాజకీయ ఉత్కంఠ నెలకొంది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు.. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసి పొత్తు పెట్టుకునేందుకు వివిధ పార్టీలను ప్రలోభపెడుతున్నాయి. కోయంబత్తూరు, ఈరోడ్, సేలంలోని కొంగు ప్రాంతంలో బలంగా ఉన్న ఎడప్పాడి వర్గం చర్చలు జరుపుతోంది. విడుతలై సిరుత్తై కట్చి (వీసీకే) లేదా నామ్ తమిళర్ పార్టీ (ఎన్టీపీ)కి 10 సీట్లను ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకేకు 33.52 శాతం ఓట్లు వచ్చాయి. అన్నాడీఎంకే ఓట్ షేర్ 19.30గా వచ్చింది. కాంగ్రెస్కు 12.61 శాతం, పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)కి 5.36 శాతం ఓట్లు వచ్చాయి. విజయకాంత్కు చెందిన డీఎండీకే 2.16 శాతం, వీసీకే 1.16 శాతం ఓట్లు సాధించాయి.
అయితే ప్రస్తుతం డీఎంకేతో చేతులు కలిపేందుకు సిద్ధమైన పట్టాలి మక్కల్ కట్చిపైనే అందరి దృష్టి ఉంది. ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. పీఎంకేకి రాజ్యసభ సీటు దక్కుతుందని.. ఈ ఫార్ములా రెండు పార్టీలకు ఆమోదయోగ్యమైనదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బార్, బార్ దేఖో..
ప్రజల దాహం తీర్చే వాగ్దానం ప్రధాన ఎన్నికల ప్రణాళికలలో ఒకటిగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే కొప్పల్లో ఓటర్ల డిమాండ్ను ఎలా తీర్చాలనే దానిపై కర్ణాటక ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఎందుకంటే.. వారు తమ కోరికను సంతృప్తిపరచడానికి త్రాగునీటి కంటే మరిన్ని బార్లు కావాలని కోరుతున్నారు. ఇటీవల కొప్పల్లోని డీసీ కార్యాలయం వద్ద మరిన్ని బార్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ విచిత్రమైన నిరసన చేపట్టారు. అయితే గ్రామస్తులు న్యాయపరమైన అంశం ఉందని అంటున్నారు. వారు తాగడానికి పొరుగు గ్రామానికి చేరుకోవాలని.. దీంతో మద్యానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇది చాలా మందికి భరించలేనిదిగా మారింది.
అయితే కొత్త బార్ లైసెన్స్లను ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఏ పార్టీ కూడా మరిన్ని బార్ల వాగ్దానాన్ని చేయాలని కోరుకోదు. మద్య నిషేధం స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఈ సమస్య రాజకీయ గందరగోళంగా మారింది.
ఫియర్ లాన్సర్స్ అకా మైక్-అసురస్..
సాధారణంగా ఫ్రీ లాన్సర్లు చాలా భయపడేవారు. కానీ కర్ణాటక మంత్రులు మీడియాలోని అన్ని రకాల ‘‘లాన్సర్ల’’ని చూసి భయపడుతున్నారు. వారిని వారు మైక్-అసురస్ అని పిలుస్తున్నారు. ఫలితంగా మంత్రులతో కిటకిటలాడే విధానసౌధ అధికార కేంద్రంగా ఔచిత్యాన్ని కోల్పోయింది. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే మంత్రులు అదృశ్యమవుతారు. పరిసరాల్లోని వివిధ కార్యాలయాల నుండి పని చేస్తున్నారు.
మంత్రులు ఈ విధంగా ప్రవర్తించడం.. కేబినెట్ భేటీ తర్వాత వారి కామెంట్స్ కోసం వేచి ఉన్న మీడియాను తప్పించుకునే వ్యూహం నుంచి వచ్చింది. ఒక మంత్రి వారి ప్రశ్నకు స్పందించినా? లేదా మౌనం వహించడానికి ఇష్టపడినా? అది హెడ్లైన్స్లో నిలుస్తుంది. దీంతో ఏ విషయంలోనైనా ఈ దుస్థితిలో చిక్కుకోకూడదని వారు భావిస్తున్నారు. అయితే మైక్-అసురులకు భయపడి హోటళ్లలోనో, క్లబ్బుల్లోనో తలదాచుకోవడం కంటే అసలు తాము ఉన్న పవర్ సెంటర్కు తిరిగి వచ్చేలా వారికి విశ్వాసం కల్పించాల్సిన అవసరం ముఖ్యమంత్రిపై ఉంది.