Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో విషాదం: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఐదుగురి మృతి

 తమిళనాడు రాష్ట్రంలోని  కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ లో బాణసంచా ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Five killed, 15 injured in explosion at fireworks factory in TNs Cuddalore
Author
Tamil Nadu, First Published Sep 4, 2020, 1:28 PM IST

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని  కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ లో బాణసంచా ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

చనిపోయినవారంతా మహిళలేనని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు కారణంగా భవనం కుప్పకూలిపోయింది. 

భవనం శిథిలాలు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలు కూడ చెల్లా చెదురుగా పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిక తరలించారు. ఈ ప్రమాదానికి గల  కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. 

గతంలో కూడ బాణసంచా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకొంటున్నా కూడ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోని కారణంగా పదే పదే ఇదే తరహాలో ప్రమాదాలు చోటు చేసుకొంటున్నట్టున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios