బెంగళూరు బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది అధికారులకు గాయాలయ్యాయి.
బెంగళూరు బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. క్వాలిటీ కంట్రోల్ యూనిట్లో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది అధికారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది బీబీఎంపీ కార్యాలయానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.