దారుణం.. కుమార్తెను ఎత్తుకెళ్లాడని.. చితకబాది, మర్మాంగాలు కోసేశారు..
యువతీ యువకులు ఇద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఇద్దరూ కలిసి ఇంటినుంచి వెళ్లిపోయి కోర్టులో పెళ్లి చేసుకున్నారు. బుధవారం ఇద్దరూ కలిసి రాజౌరీ గార్డెన్ పోలీస్ స్టేషన్ కు స్టేట్ మెంట్ల రికార్డు కోసం వెళ్లారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ బయటే కాపు కాసిన యువతి కుటుంబ సభ్యులు వారిని పట్టుకుని సాగర్పూర్ లోని వారింటికి తీసుకెళ్లారు.
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సాగర్ పూర్ లో దారుణం జరిగింది. తమ కుమార్తెను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో యువతి Family members అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. యువకుడిని (22) పట్టుకుని చితకబాదారు. ఆ పై అతని genitalsను కోసేశారు. ఈ ఘటనకు సంబంధించి యువతి కుటుంబ సభ్యులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు విషయంలో సరిగా దర్యాప్తు జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. యువతీ యువకులు ఇద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఇద్దరూ కలిసి ఇంటినుంచి వెళ్లిపోయి కోర్టులో పెళ్లి చేసుకున్నారు. బుధవారం ఇద్దరూ కలిసి రాజౌరీ గార్డెన్ పోలీస్ స్టేషన్ కు స్టేట్ మెంట్ల రికార్డు కోసం వెళ్లారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ బయటే కాపు కాసిన యువతి కుటుంబ సభ్యులు వారిని పట్టుకుని సాగర్పూర్ లోని వారింటికి తీసుకెళ్లారు.
ఆ తర్వాత అతడి మర్మాంగాలను కోసేశారు. బాధితుడు ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, మూఢనమ్మకంతో సొంత కుటుంబాన్నే బలిచేశాడో వ్యక్తి. ప్రకృతిని ప్రేమించి.. జంతువులను ఆదరించే వ్యక్తి.. మోక్షం కల్పిస్తానంటూ.. తన కుటుంబాన్ని బలితీసుకున్నాడు. మూఢ నమ్మకాలతో కడుపున పుట్టిన బిడ్డలను, కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఆ తర్వాత తాను ప్రాణం తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల మృతదేహాలతో, వారి రక్తంతో ఇళ్లంతా బీభత్సంగా కనిపించింది. ఈ దారుణ ఘటన హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
మోక్షం అంటూ... మూఢత్వంతో కుటుంబాన్ని బలితీసుకున్న వ్యక్తి
స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. హర్యానాలోని హిస్సార్ నంగ్తలా గ్రామంలో రమేష్ వర్మ (45) తన కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నారు. ఒక ప్రింటింగ్ ప్రెస్ నునడుపుతున్నారు. భార్యా పిల్లలను చాలా ఆప్యాయంగా చూసుకునే రమేష్. ప్రకృతిని ఎంతగానోప్రేమించే ఆయన.. తన ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుతున్నాడు. పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి.
అయితే, ఉన్నట్టుండి ఒక రోజు ఆయన కుటుంబం మొత్తం ఇంట్లో రక్తపు మడుగులో పడివుంది. ఈ దారుణానికి పాల్పడింది రమేష్ కావడం సంచలనంగా మారింది. కుటుంబాన్ని ఎంతో ఆప్యాయంగా చుసుకున్న రమేష్.. అకస్మాత్తుగా తన భార్యా, పిల్లలను ఇనుపరాడ్డుతో కొట్టి చంపి ఇంటిని రక్తపుటేరుగా మార్చాడు. ఆ తర్వాత తాను వేగంగా వచ్చే లారీ అడ్డుగా వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా భయాందోళనలు రేకేత్తించింది. ఈ ఘటనలో భార్యా సునీత (38), ముగ్గురు పిల్లలు అనుష్క (14), దీపిక (12), కేశవ్ (10)లు మృతి చెందారు.
కాగా, ఈ ఘటనపై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి డిన్నర్ తర్వాత పాయసంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి.. వారు నిద్రిస్తున్న సమయంలో వారిని రమేష్ వర్మ హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రమేష్ రాసిన సుసైడ్ లెటర్ సంచలనంగా మారింది. రమేష్ రాసిన లెటర్ తోనే ఈ హత్యలు ఎందుకు చేశాడనేది పోలీసులకు తెలిసింది. మోక్షం కోసమే ఇలా చేసినట్టు లెటర్లో రాశాడు. తనతో పాటు ఇంట్లో అందరికీ మోక్షం జరగాలని చంపినట్టు లెటర్లో పేర్కొన్నాడు.
అంతేకాదు తన ఇంటికి ఎప్పుడూ తాళం వేసి ఉంచాలని, ఇంట్లోనే తన ఆత్మ తిరుగుతూ ఉంటుందని లేఖలో రాసుకోచ్చాడు రమేష్. అలాగే, తన చితాభస్మాన్ని శ్మశాన వాటికలోని మొక్కలకు, చెట్టుకు మొదల్లో వేయాలని అందులో పేర్కొన్నాడు. స్థానికులు ఈ ఘటన నేపథ్యంలో భయాందోళనకు గురవుతున్నారు.