మద్యం మత్తులో 70 ఏండ్ల వృద్దురాలిపై యువకుడి అత్యాచారం.. పరిస్థితి విషమం..
మద్యం మత్తులో ఉన్న ఓ యవకుడు పొరుగింటి ఉన్న 70 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి చేశాడు. ఈ సంఘటన రాజస్థాన్లోని దౌసా జిల్లాలో జరిగింది.
మనుషుల్లో మానవత్వం రోజురోజుకు కనుమరుగై పోయింది. నిత్యం ఏదొక ఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. క్రమంగా కొందరూ తమ మానవత్వాన్ని మరిచిపోయి ఉన్మాదులు గా మారిపోతున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, హత్యలకు పాల్పడటం, ఆస్తుల కోసం సొంత వారి ప్రాణాలు తీయడం. మరో వైపు కామంతో ఊగిపోతూ అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారం చేయడం. వావివారసులు మరిచి.. ప్రవర్తించడం. ఇవ్వన్ని వెరసీ మానవమృగాలు గా మారిపోతున్నారు. ఇటీవలే రాజస్థాన్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్లోని దౌసా జిల్లాలో 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బస్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలోని వృద్దురాలిపై 32 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డారు. మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు అందిన సమాచారం ప్రకారం.. దౌసాలోని బస్వా పోలీస్ స్టేషన్ పరిధిలో 70 ఏళ్ల వృద్ధురాలు తన భార్త కలిసి నివసిస్తుంది. అయితే శుక్రవారం సాయంత్రం ఆ వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె భర్త ఆవులు, గేదెలను మేపేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో 35 ఏళ్ల యువకుడు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలిని వంటగదిలోకి లాగాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు.ఈ క్రమంలో ఆ వృద్దురాలిపై దాడి చేశాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. నిందితుడు యువకుడు మహిళను వదిలి అక్కడి నుంచి పారిపోయాడు.
కొంత సేపటి తర్వాత ఇంటికి చేరుకున్న మహిళ భర్తకు జరిగిన విషయం తెలిసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితిని చూసిన వైద్యులు ఆమెను దౌసాకు రెఫర్ చేశారు. అక్కడి నుంచి వైద్యులు మహిళను జైపూర్కు తరలించారు. మహిళ ప్రైవేట్ పార్ట్కు గాయాలైనట్లు సమాచారం. నిరంతర రక్తస్రావం కారణంగా ఆమె పరిస్థితి విషమంగా మారింది.