Vistara:  ఇండోర్ విమానాశ్రయంలో సరిగ్గా శిక్షణ పొందని పైలట్‌ను ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి అనుమతించినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విస్తారాపై ₹10 లక్షల జరిమానా విధించింది. అదే స‌మ‌యంలో భ‌ద్ర‌తా నియ‌మాల‌ను ఉల్ల‌ఘించిన‌ట్టు అధికారులు గుర్తించారు 

Vistara: ఎయిర్ లైన్స్ విస్తారాకు సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) భారీ షాక్ ఇచ్చింది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ విస్తారాపై డిజిసిఎ రూ.10 లక్షల జరిమానా విధించారు. 

సరిగ్గా శిక్షణ పొందని పైలట్‌ను ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి అనుమతించ‌డంతో పాటుగా.. టేకాఫ్, ల్యాండింగ్ క్లియరెన్స్‌లను ఉల్లంఘించి నందుకు విమానయాన సంస్థకు ₹10 లక్షల జరిమానా విధించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులు తెలిపారు. ఈ త‌ప్పిదాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ల్యాండింగ్ సమయంలో గుర్తించారు. 

 "ఇది విమానంలోని ప్రయాణీకుల ప్రాణాలకు హాని కలిగించే తీవ్రమైన ఉల్లంఘన" అని ఒక అధికారులు పేర్కొన్నారు. ప్రయాణీకులతో కూడిన విమానాన్ని ల్యాండ్ చేయడానికి ముందుగా సిమ్యులేటర్‌లో విమానాన్ని ల్యాండ్ చేయడానికి మొదటి అధికారికి శిక్షణ ఇవ్వాలి. మొదటి అధికారిని విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించే ముందు కెప్టెన్ కూడా సిమ్యులేటర్ వద్ద శిక్షణ పొందుతాడు.

గతంలో.. DGCA బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల పైలట్‌లకు లోపభూయిష్ట సిమ్యులేటర్‌పై శిక్షణ ఇచ్చినందుకు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఈ చర్య విమాన భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వర్గాలు తెలిపాయి. పైలట్‌లను నిషేధించిన తర్వాత.. రెగ్యులేటర్ ఏప్రిల్‌లో ఎయిర్‌లైన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 

అంతేకాకుండా.. మే 7న రాంచీ విమానాశ్రయంలో ప్రత్యేక సామర్థ్యం గల పిల్లలను బోర్డింగ్‌కు నిరాకరించినందుకు ఇండిగో ఎయిర్‌లైన్‌కు రూ. 5 లక్షల జరిమానా విధించారు. ఇండిగో రాంచీ-హైదరాబాద్ ట్రిప్‌కు ఎక్కేందుకు చిన్నారికి అనుమతి నిరాకరించింది. విమానయాన పర్యవేక్షణ సంస్థ ఇదే తొలిసారి. ఒక విమానయాన సంస్థపై ఆర్థిక జరిమానా విధించింది.

2022 ఏప్రిల్ లో భార‌త‌దేశంలో సుమారు 1.08 కోట్ల మంది ప్రయాణికులు దేశీయ విమానాల్లో ప్రయాణించారు. ఈ సంఖ్య మార్చితో పోలిస్తే రెండు శాతం ఎక్కువ. అప్పుడు 1.06 కోట్ల మంది దేశీయ ప్రయాణికులు విమానంలో ప్రయాణించారు. డిజిసిఎ ఇటీవల తన నెలవారీ ప్రకటనలో ఏప్రిల్‌లో అన్ని విమానయాన సంస్థల 78 శాతానికి పైగా ఉందని పేర్కొంది.