Asianet News TeluguAsianet News Telugu

రేపటి నుంచి భక్తులకు బాల రాముడి దర్శనం.. ఏటా 50 మిలియన్లకు పైగా పర్యాటకులు వచ్చే ఛాన్స్

అయోధ్య ఆలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట (ayodhya ram mandir pran pratishtha) పూర్తయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (prime minister narendra modi) బాల రాముడి (ram lalla) ప్రాణ ప్రతిష్ట వేడుకను తన చేతుల మీదుగా పూర్తి చేశారు. దీంతో రేపటి నుంచి అయోధ్య ఆలయాన్ని సాధారణ భక్తులు (Ayodhya Ram Mandir opens for public from Tuesday)దర్శించుకోవచ్చు.

Devotees will have a darshan of Bala Ram from tomorrow. More than 50 million tourists come every year..ISR
Author
First Published Jan 22, 2024, 2:15 PM IST

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక పూర్తయ్యింది. రామ్ లల్లాకు ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ప్రణ ప్రతిష్ట చేశారు. దీంతో యావత్ దేశంతో పాటు ప్రపంచంలోని హిందువుల కల నెరవేరింది. 500 ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు అక్కడికి వెళ్లిన ప్రముఖులకు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులందరికీ ఆ బాల రాముడు దర్శనం ఇవ్వనున్నారు. 

500 ఏళ్ల నిరీక్షణకు తెర.. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట పూర్తి.. భావోద్వేగానికి గురైన భక్తులు

అయితే సాధారణ భక్తులకు రేపటి (మంగళవారం) నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అవకాశం ఇవ్వనుంది. మంగళవారం నుంచి ఆలయ తలుపులు భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. సుందరమైన, మనోహరమైన ఆ బాలరాముడి రూపం చూసి భక్తులు తరించనున్నారు. ఈ అయోధ్య నగరం ఆధ్యాత్మిక మైలురాయి మతపరమైన ఉత్సాహానికి కేంద్రంగా మారడమే కాకుండా, ఈ ప్రాంతపు ఆర్థిక స్థితిగతులను కూడా గణనీయంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.

అయోధ్య ఇక నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుందని, ఏటా 50 మిలియన్ల నుండి 5 కోట్ల మంది సందర్శకులు ఇక్కడికి రావొచ్చని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ నివేదిక తెలిపింది. కొత్త విమానాశ్రయం అభివృద్ధి, అప్ గ్రేడ్ చేసిన రైల్వే స్టేషన్, టౌన్ షిప్ విస్తరణ, మెరుగైన రహదారి కనెక్టివిటీ, కొత్త హోటళ్ల స్థాపనతో సహా 10 బిలియన్ డాలర్ల మేకోవర్ ద్వారా ఆర్థిక ప్రోత్సాహం మరింత పెరిగింది. ఇది వివిధ ఆర్థిక కార్యకలాపాలపై ప్రకంపనల ప్రభావాన్ని చూపుతుంది.

ప్రాణ ప్రతిష్ఠతో రామ రాజ్యం ప్రారంభం - శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్

175 మిలియన్ డాలర్లతో నిర్మించిన అయోధ్య విమానాశ్రయం మొదటి దశ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇది 1 మిలియన్ ప్రయాణీకులకు వసతి కల్పించగలదు. 60 లక్షల మంది ప్రయాణీకులను నిర్వహించగల అంతర్జాతీయ టెర్మినల్ 2025 నాటికి పూర్తవుతుంది. రోజుకు 60,000 మంది ప్రయాణీకులకు సేవలందించడానికి వీలుగా రైల్వే స్టేషన్ సామర్థ్యం రెట్టింపు అయింది. అదనంగా, 1,200 ఎకరాల గ్రీన్ ఫీల్డ్ టౌన్ షిప్, మెరుగైన రహదారి కనెక్టివిటీ కోసం ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇది అయోధ్య మొత్తం మౌలిక సదుపాయాలను మరింత పెంచుతుంది.

ఎన్నో జ‌న్మ‌ల ఫ‌లమిది.. అయోధ్య రామయ్య దివ్యమంగళ దర్శనం.. ఫొటోలు మీరు చూసేయండి.. !

కాగా.. భారతదేశ సహజ సౌందర్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది, ఫోర్బ్స్ 2022 లో 7వ అత్యంత అందమైన దేశంగా పేర్కొంది. దేశం 42 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 6 వ స్థానాన్ని పొందింది. భారత్ వైవిధ్యమైన భౌగోళిక లక్షణాలను ప్రదర్శిస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios