మనీ ల్యాండరింగ్ కేసులో ఆప్ మంత్రి సత్యేంద్రజైన్ కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బెయిల్ పిటిషన్ మీద ఢిల్లీ కోర్టు రేపు వాదనలు విననుంది.
ఢిల్లీ : మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు అక్కడి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆయన బెయిల్ పిటిషన్ పై రేపు ఢిల్లీ కోర్టు వాదనలు విననుంది. కోల్కతాకు చెందిన ఓ కంపెనీ కి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో మే 30వ తేదీన అధికారులు సత్యేంద్ర జైన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-2016 సమయంలో హవాలా నెట్వర్క్ ద్వారా జైన్ కంపెనీలకు.. షెల్ కంపెనీల నుంచి సుమారు రూ. 4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది.
సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఇటీవల ఆయనను అరెస్టు చేసింది. జైన్ ను కోర్టులో ప్రవేశపెట్టగా.. జూన్ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని.. ఈడీ కోరగా దాన్ని జూన్ 13 వరకు పొడిగించింది. తాజాగా మరో 14 రోజుల వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
Satyendar Jain: రాజకీయ ప్రేరేపిత చర్య.. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ పై ఆప్ వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో జూన్ 7న సాయంత్రం ఈడీ సోదాలు ముగిసాయి. ఇంట్లో 1.80 కిలోల బంగారం, రూ.2.85 కోట్ల నగదును ఈడీ అధికారులు సీజ్ చేశారు. కోల్కతాకు చెందిన ఒక సంస్థకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంలో ఈ ఈ నెల 6వ తేదీన ఈడీ సోదరులు ప్రారంభించింది. ఏడవ తేదీ సాయంత్రం ఈడీ సోదాలు ముగిశాయి. ఈడీ అధికారులు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తో పాటు అతడి సహాయకుడి ప్రాంగణంలో ఉంచిన రూ. 2.82 కోట్ల నగదు, 133బంగారు నాణెలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 9వ తేదీ వరకు మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ కస్టడీలో ఉంచాలని ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ఆదేశించారు
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంలొ జైన్ ఆరోగ్యం, విద్యుత్, హోం, పీడబ్ల్యూడీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. కోల్కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించిన హవాలా లావాదేవీలకు సంబంధించి ఢిల్లీ ఆరోగ్య మంత్రి జైన్ నివాసంలో జూన్ 6,7న సోదాలు నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్ మాసం లో మనీలాండరింగ్ విచారణలో మంత్రి సత్యేంద్ర జైన్ నియంత్రణలో ఉన్న రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ మెంట్ కోసం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ గతంలో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
2017 ఆగస్టులో మంత్రికి వ్యతిరేకంగా మనీలాండరింగ్ కేసు నమోదయ్యింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసును రాజకీయ ప్రేరేపితమయిందిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. గత వారంలోనే ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. పంజాబ్ ఎన్నికలకు ముందే సత్యేంద్రను అరెస్టు చేస్తారని తమకు సమాచారం అందిందని.. పంజాబ్ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలు అవుతుందని గ్రహించిన తర్వాత బిజెపి ప్రభుత్వం ఆప్ నులక్ష్యంగా చేసుకుందని కేజ్రీవాల్ ఆరోపించారు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భగవంత మాన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2018లో ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు మంత్రిని ప్రశ్నించారు.
