Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ 19 : పీఎం-కేర్స్ ఫండ్ కు దలైలామా సాయం

కోవిడ్ 19 భయంతో అల్లాడుతున్న భారత్ కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. కరోనా నిర్మూలనకు దేశం చేస్తున్న ప్రయత్నాలకు టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మద్దతుగా నిలిచారు. పీఎం-కేర్స్ పండ్ కు సహకరించాలని నిర్ణయించారు.

Dalai Lama Contributes To PM-CARES Fund To Strengthen Fight Against COVID-19 - bsb
Author
Hyderabad, First Published Apr 27, 2021, 5:01 PM IST

కోవిడ్ 19 భయంతో అల్లాడుతున్న భారత్ కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. కరోనా నిర్మూలనకు దేశం చేస్తున్న ప్రయత్నాలకు టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మద్దతుగా నిలిచారు. పీఎం-కేర్స్ పండ్ కు సహకరించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను దలైలామా ప్రశంసించారు. ముఖ్యంగా ఫ్రంట్‌లైన్‌లో పనిచేస్తున్న వారి కృషిని ఆయన అభినందించారు.

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వరుస సవాళ్లను ఆందోళనతో గమనిస్తూనే ఉన్నానంటూ దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భయంకరమైన కరోనా సునామీలో తోటి భారతీయ సోదర, సోదరీమణులకు తన సంఘీభావంగా పీఎం కేర్స్‌ ఫండ్‌కు  విరాళం ఇవ్వమని దలైలామా ట్రస్టును కోరానని ఆయన చెప్పారు.

ఈ మహమ్మారి ముప్పు త్వరలోనే ముగిసి పోవాలని ఆయన కోరుకున్నారు. మరోవైపు దేశంలో రోజుకు మూడు లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నాటికి 3,23,144  మంది కొత్తగా కారణం బారినపడ్డారు.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. అయితే జాతీయ రికవరీ రేటు 82.54  శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios