కోవిడ్ 19 : పీఎం-కేర్స్ ఫండ్ కు దలైలామా సాయం
కోవిడ్ 19 భయంతో అల్లాడుతున్న భారత్ కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. కరోనా నిర్మూలనకు దేశం చేస్తున్న ప్రయత్నాలకు టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మద్దతుగా నిలిచారు. పీఎం-కేర్స్ పండ్ కు సహకరించాలని నిర్ణయించారు.
కోవిడ్ 19 భయంతో అల్లాడుతున్న భారత్ కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. కరోనా నిర్మూలనకు దేశం చేస్తున్న ప్రయత్నాలకు టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మద్దతుగా నిలిచారు. పీఎం-కేర్స్ పండ్ కు సహకరించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను దలైలామా ప్రశంసించారు. ముఖ్యంగా ఫ్రంట్లైన్లో పనిచేస్తున్న వారి కృషిని ఆయన అభినందించారు.
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వరుస సవాళ్లను ఆందోళనతో గమనిస్తూనే ఉన్నానంటూ దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భయంకరమైన కరోనా సునామీలో తోటి భారతీయ సోదర, సోదరీమణులకు తన సంఘీభావంగా పీఎం కేర్స్ ఫండ్కు విరాళం ఇవ్వమని దలైలామా ట్రస్టును కోరానని ఆయన చెప్పారు.
ఈ మహమ్మారి ముప్పు త్వరలోనే ముగిసి పోవాలని ఆయన కోరుకున్నారు. మరోవైపు దేశంలో రోజుకు మూడు లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నాటికి 3,23,144 మంది కొత్తగా కారణం బారినపడ్డారు.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. అయితే జాతీయ రికవరీ రేటు 82.54 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.