New Delhi: బిపర్జోయ్ తుఫాన్ గుజరాత్ లోని కచ్ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ పాకిస్తాన్ వైపు తిరిగిన తర్వాత కాస్త బలహీనపడే అవకాశం ఉంది. అయితే తుఫాను ప్రభావంతో ఉప్పెనలు, బలమైన గాలులు, భారీ వర్షాలతో ఈ ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో జూన్ 6 న ఏర్పడినప్పటి నుండి, బిపర్జోయ్ ఉత్తరం వైపు ముందుకు సాగుతూ.. జూన్ 11 న అత్యంత తీవ్రమైన తుఫానుగా మారింది. గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి.
Cyclone Biparjoy: బిపర్జోయ్ తుఫాన్ ప్రభావంతో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్కైమెట్ తెలిపింది. బిపర్జోయ్ తుఫాన్ గుజరాత్ లోని కచ్ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ పాకిస్తాన్ వైపు తిరిగిన తర్వాత కాస్త బలహీనపడే అవకాశం ఉంది. అయితే తుఫాను ప్రభావంతో ఉప్పెనలు, బలమైన గాలులు, భారీ వర్షాలతో ఈ ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో జూన్ 6 న ఏర్పడినప్పటి నుండి, బిపర్జోయ్ ఉత్తరం వైపు ముందుకు సాగుతూ.. జూన్ 11 న అత్యంత తీవ్రమైన తుఫానుగా మారింది. గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి.
బిపర్జోయ్ తుఫాను తీరం దాటిన తర్వాత దాని తీవ్రతను కోల్పోయి ఆగ్నేయ రాజస్థాన్ మీదుగా అల్పపీడనంగా కదులుతూ ఈశాన్య దిశగా కదులుతుంది. జూన్ 18-19 నాటికి ఈ అల్పపీడనం ఢిల్లీ, పంజాబ్, హర్యానా, వాయవ్య ఉత్తరప్రదేశ్ కు దగ్గరగా ఉంటుందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్కైమెట్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ పలావత్ తెలిపారు. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడినప్పుడల్లా అది వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉందనీ, దీనివల్ల తూర్పు తీరంలోని భారత ప్రధాన భూభాగంలో వర్షపాతం పెరుగుతుందని పలావత్ తెలిపారు. అయితే అరేబియా సముద్రంలోని వాతావరణ వ్యవస్థలు సాధారణంగా యెమెన్, ఒమన్ వైపు కదులుతాయి.
కానీ, బోపర్జోయ్ తుఫాను పాకిస్తాన్, భారత్ పశ్చిమ తీరం వైపు కదులుతుందనీ, దీంతో దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే రెండు వారాల్లో ఆ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదు. అయితే దక్షిణ భారత తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. బిపర్జోయ్ తుఫాను ఇప్పుడు రుతుపవనాల ప్రవాహం నుండి పూర్తిగా వేరు చేయబడిందనీ, ఈ సంవత్సరం రుతుపవనాలు లేదా దాని పనితీరుపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదని భారత వాతావరణ శాఖ (ఐఎండి) మంగళవారం తెలిపింది. అరేబియా సముద్రంపై భూమధ్యరేఖ ప్రవాహాన్ని పెంచడం ద్వారా ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాలపై రుతుపవనాలు ముందుకు సాగడానికి తుఫాను సహాయపడిందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
గురువారం సాయంత్రం కచ్ జిల్లాలోని జఖౌ రేవు సమీపంలో బిపర్జోయ్ తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున గుజరాత్ లోని తీర ప్రాంతాల నుంచి కనీసం 44,000 మందిని తాత్కాలిక షెల్టర్లకు తరలించారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయనీ, ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలకు సహాయం చేయడానికి సైన్యం కూడా సిద్ధంగా ఉంది. వ్యూహాత్మక ప్రదేశాలలో వరద సహాయక దళాలను మోహరించింది.
