రామన్ మెగసెసె అవార్డు తిరస్కరించిన కేరళ మాజీ ఆరోగ్య మంత్రి.. కారణమేమిటంటే..?
కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ మెగసెసె అవార్డును స్వీకరించేందుకు నిరాకరించారు. ప్రజారోగ్యం లో ఆమె చేసిన సేవకు గాను శైలజను రామన్ మెగసెసె అవార్డు ఫౌండేషన్ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే.. సీపీఎం నాయకత్వం అంగీకరించకూడదని నిర్ణయించుకుంది. ఆ తర్వాత.. ఆమె అవార్డును స్వీకరించడానికి నిరాకరించింది.
ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసె అవార్డును కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ స్వీకరించేందుకు నిరాకరించారు. సీపీఎం కేంద్ర అధిష్టానం తిరస్కరించాలని నిర్ణయించడంతో ఆమె అవార్డును
తిరస్కరించారు. ఆమె తన పదవీకాలంలో నిపా, కోవిడ్ నివారణలో చేసిన కృషికి అంతర్జాతీయ గుర్తింపు
లభించింది. అయితే శైలజ ఈ అవార్డును స్వీకరించలేనని ఆర్గనైజింగ్ కమిటీకి తెలియజేసింది.
వివరాల్లోకెళ్తే.. CPI(M) కేరళ యూనిట్ కేరళ మాజీ ఆరోగ్య మంత్రి K.K. శైలజ 2022 గానూ ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డుకు ఎంపికైంది. ఆరోగ్య మంత్రిగా ఆమె చేసిన సేవకు మెగసెసె అవార్డు ఫౌండేషన్ 64వ మెగసెసే అవార్డుకు ఎంపిక చేసింది. ఆమె తన పదవీ కాలంలో నిపా వ్యాప్తి, కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆమె నాయకత్వంలో అంటు వ్యాధుల నివారణ చేసిన కార్యక్రమాలను మంచి గుర్తింపు వచ్చింది. ఈ సమయంలో దేశ, విదేశాల్లోని పలు మీడియా సంస్థలు శైలజ సేవలను కొనియాడాయి.
జూలై 2022 చివరిలో మెగసెసె అవార్డు ఫౌండేషన్ వారు.. శైలజకు ఈ-మెయిల్ ద్వారా.. ఆమె పేరును షార్ట్లిస్ట్ చేసిన విషయాన్ని తెలిపారు. అవార్డును స్వీకరించడంలో ఆమె ధృవీకరణను కోరారు. అయితే.. ఆమె సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నందున.. ఆమె పార్టీ నాయకత్వానికి సమాచారం అందించారు. వివరణాత్మక చర్చల తర్వాత.. సీపీఐ(ఎం) అవార్డును స్వీకరించకూడదని నిర్ణయించింది. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను శైలజ నిర్వర్తిస్తున్నారని, ఇందులో విశేషమేమీ లేదని సీపీఐ(ఎం) సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. నిపా, కోవిడ్-19 పై పోరాటం ఉమ్మడి ప్రయత్నమని కూడా పార్టీ విశ్వసిస్తోంది. ఇది వ్యక్తిగత ప్రయత్నం కాదు, కాబట్టి వారు అవార్డును అంగీకరించకూడదని నిర్ణయించారు.