Modi govt 8 failures: ‘8 ఏండ్లలో.. 8 వైఫల్యాలు’
Modi govt 8 failures:మోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో అనేక వైఫల్యాలను ఎదురుచూసిందనీ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగిత రేట్లు,అనియంత్రిత ద్వేషపూరిత రాజకీయాలతో సహా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక వైఫల్యాలను" చూసిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఆరోపించింది.
Modi govt 8 failures: ప్రధాని మోదీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో ఎన్నో ఘోర వైఫల్యాలు ఎదుర్కొన్నట్లు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ‘8 ఏండ్లలో.. 8 మోసాలు’ పేరుతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలా గురువారం మోదీ సర్కారు పాలనపై రిపోర్టును విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, ద్రవ్యోల్బణం, మత సామరస్యం, నిరుద్యోగం, జాతీయ భద్రత రంగాల్లో మోదీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆక్షేపించారు. మోదీ హామీ ఇచ్చిన మంచిరోజులు కనుచూపు మేరలో కనపడడం లేదని విమర్శించారు.
గురువారం మే 26న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంలో దేశం చాలా నష్టపోయిందని మహారాష్ట్ర ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి మహేశ్ తాప్సీ అన్నారు. ప్రభుత్వ వైఫల్యం, విద్వేషపూరిత రాజకీయాలు, రూపాయి విలువ చరిత్రాత్మక పతనం. , 'ఆర్థిక పతనంస, సామాజిక నిర్మాణం యొక్క క్షీణత వంటి ప్రభుత్వ ఎనిమిది వైఫల్యాలను చవిచూసిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశం చాలా నష్టపోయిందని మహేశ్ తాప్సీ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశంలో మత సామరస్యాన్ని ధ్వంసమయ్యందనీ, సైన్స్, సమానత్వంపై మతం ఆధిపత్యం చెలాయిస్తుందని అన్నారు.
మోదీజీ వస్తే మంచి రోజులు వస్తాయని భావించిన వారికి.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తీసుకొచ్చారని సూర్జేవాలా అన్నారు. మోసం, అబద్ధాలు, ద్వేషాలను ఆశ్రయిస్తున్నారని అన్నారు. ఇప్పుడు రైతుల ఆదాయం, ప్రజలే బుల్ డోజర్లను పరుగులు పెట్టిస్తారనీ.. బీజేపీకి జుమ్లాలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు.
ఇంత జరిగినా... ఎవరికి మంచి రోజులు వచ్చాయని అజయ్ మాకెన్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోవిడ్ వల్ల ఎవరి ఆస్తులు పెరిగాయని, రైతులకు నల్ల చట్టాలు, 1000 రూపాయల గ్యాస్, 12 కోట్ల ఉద్యోగాలు పోయాయని ఇదంతా మోడీ పాలన వల్లే జరిగిందని ఎద్దేవా చేశారు.
అలాగే.. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ను ఉటంకిస్తూ.. ఈ జాబితాలో భారత్ 55 నుండి 101 స్థానానికి చేరుకుందని చెప్పారు. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్లో 140 నుండి 150 కి, రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో 35 నుండి 79 కు, ప్రజాస్వామ్య సూచికలో 27 నుండి 46 కు.. ఇలా ప్రతి పారామీటర్లో భారత్ దిగజారిందని అన్నారు.
ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రజలకు ఎనిమిది మోసాలు చేసిందని అజయ్ మాకెన్ అన్నారు. మొదటి ఉపాయం బీజేపీ, ఆ తర్వాత ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం పెరిగింది. రెండవ ఉపాయం- యువ దేశాన్ని నిరుద్యోగంలోకి నెట్టడం. మూడవ ఉపాయం-
ఎనిమిదేళ్లలో మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పడిపోయిందనీ, రూపాయి చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయిందనీ అన్నారు. గత 8 సంవత్సరాలలో ప్రభుత్వం 80 లక్షల కోట్ల ప్రభుత్వ అప్పులను తీసుకుందనీ, 9 లక్షల కోట్ల రుణా మాఫీ చేసిందని విమర్శించారు. దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడం. చిన్నా పెద్దా అల్లర్లు అన్నీ కలిపి చెబితే... గత 8 ఏళ్లలో దాదాపు 10000 అల్లర్లు జరిగాయనీ, అలాగే వెనుకబడి, SC / ST / OBCతో సంబంధాలను తెంచుకుందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలోనూ విఫలమయ్యారని విమర్శించారు.