హర్యానాకు చెందిన బీజేపీ నేత గోవాలో ఓ అపార్ట్‌మెంట్‌లో మరణించారు. ఆమె మరణంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే మర్డర్ కేసు నమోదు చేశారు. త్వరలోనే ఈ కేసును సీబీఐ టేకప్ భోరనున్నట్టు తెలిసింది. 

న్యూఢిల్లీ: బీజేపీ నేత సోనాలి ఫోగమ్ మరణానికి సంబంధించిన కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టేగషన్ (సీబీఐ) దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే సీబీఐ సోనాలీ ఫోగట్ మర్డ్రర్‌కు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సోనాలీ ఫోగట్ మర్డర్ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్వయంగా కేంద్ర హోం వ్యవహారాల శాఖకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఫోన్ కాల తర్వాత తాజాగా పోలీసులు రావడం మొదలుపెట్టారు.

హర్యానాకు చెందిన బీజేపీ నేత సోనాలీ ఫోగట్ ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో చంపేశారు. కానీ, ఆమె మరణాన్ని చూస్తే అది తప్పకుండా హత్యే అని తెలుస్తుందని వివరించారు. 

సోనాలీ ఫోగట్ అటాప్సీ రిపోర్టులో ఆమె బాడీపై పదునైన గాయాలు ఉన్నట్టు తేలింది. ఆ తర్వాతనే గోవా పోలీసులు సంచలన వ్యాఖ్య చేశారు. బహుశా ఆమెతోపాటుగా ఉన్నా ఇద్దరు వ్యక్తులు సోనాలీ ఫోగట్ ఎక్కువ తాగేలా బలవంతపెట్టినట్టు అర్థం అవుతున్నదని పేర్కొన్నారు.