Amritsar: పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో భారత భద్రతా దళం (BSF ) సిబ్బంది రూ.27 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్మగ్లర్లు సరిహద్దుల్లో హెరాయిన్‌ను భారత సరిహద్దుల‌లో అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్నారు.  

Amritsar: పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో భారత భద్రతా దళం (BSF ) సిబ్బంది రూ.27 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్మగ్లర్లు సరిహద్దుల్లో హెరాయిన్‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్నారు. ఆ చ‌ర్య‌ను చేధించ‌డంలో భార‌త‌ జవాన్లు విజయం సాధించారు. ప్రస్తుతం హెరాయిన్‌ను జప్తు చేసి.. చర్యలు ప్రారంభించారు.

సోమ‌వారం ఉద‌యం అమృత్‌సర్ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. భద్రత కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ముందు జవాన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో వారికి కొన్ని ఇటుకలు, రెండు బోలు పంపులు లభించాయి. ఇటుకలు కాస్త వింతగా కనిపించాయి. సైనికులు దానిని బద్దలు కొట్టి చూసిన వారికి ఊహించని విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి, వాటిని చూసి సైనికులందరూ ఆశ్చర్యపోయారు.

ఆ ఇటుకలను హెరాయిన్‌తో త‌యారు చేశారు. బోలు పంపుల్లో కూడా హెరాయిన్ లభ్యమైంది. ఈ విషయాన్ని సైనికులు వెంటనే ఉన్నతాధికారులకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని చర్యలు చేపట్టారు. దీని తరువాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. 

బీఎస్ఎఫ్ జవాన్లు హెరాయిన్ నింపిన మొత్తం 8 ఇటుకలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రెండు హాలో పంపులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 3.870 కిలోల హెరాయిన్ ల‌భ్య‌మైంది. దీని అంతర్జాతీయ ధర రూ. 27 కోట్లు ఉంటుందని అంచనా.

డ్ర‌గ్స్ ర‌వాణాకు స్మ‌గ్ల‌ర్లు నూత‌న ప‌ద్ద‌తుల‌ను అన్వేషిస్తున్న భార‌త సైన్యం వాటిని చిత్తు చేస్తుంది. డ్రోన్‌ల ద్వారా హెరాయిన్‌ను రవాణా చేయడం, బాటిల్ ద్వారా ర‌వాణా చేయడం, పైపుల ద్వారా, కలపలో నింపడం వంటి కేసులు చాలా ఉన్నాయి. అయితే భారత భూభాగంలో హెరాయిన్‌ను ఇటుకలలో నింపడం ఇదే మొదటిసారి.