Asianet News TeluguAsianet News Telugu

నెల కిందట మిస్సింగ్.. 10 అడుగుల లోతులో అస్థిపంజరాలుగా...

ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటాను అన్నాడు. చివరకు ఆమెను కాదని మరో మహిళతో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆగ్రహించిన లవర్ ప్రియుడు కి కాబోయే భార్య ఫోటో, ఫోన్ నెంబర్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దాంతో ఆగ్రహించిన ప్రియుడు ఆమెతో పాటు కుటుంబ సభ్యులు నలుగురిని హత్య చేశాడు. వారందరినీ పొలంలో 10 అడుగుల లోతులో పాతిపెట్టాడు.

Bodies of five missing since May exhumed from 10-foot-deep pit; 6 arrested in madyapradesh - bsb
Author
Hyderabad, First Published Jun 30, 2021, 11:50 AM IST

ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటాను అన్నాడు. చివరకు ఆమెను కాదని మరో మహిళతో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆగ్రహించిన లవర్ ప్రియుడు కి కాబోయే భార్య ఫోటో, ఫోన్ నెంబర్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దాంతో ఆగ్రహించిన ప్రియుడు ఆమెతో పాటు కుటుంబ సభ్యులు నలుగురిని హత్య చేశాడు. వారందరినీ పొలంలో 10 అడుగుల లోతులో పాతిపెట్టాడు.

మధ్యప్రదేశ్ నేమవర్ పట్టణానికి చెందిన రూపాలి అనే యువతి, అదే ప్రాంతానికి చెందిన సురేంద్ర చౌహాన్‌ అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. కొద్ది రోజులపాటు బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత సురేంద్ర మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీని గురించి రూపాలికి తెలిసింది. ఆగ్రహించిన ఆమె సురేంద్ర చేసుకోబోయే యువతి ఫోటో, ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ఈ విషయం కాస్త సురేంద్రకు తెలియడంతో రూపాలి అడ్డు తొలగించుకోవాలని భావించాడు, స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాడు. దాంట్లో భాగంగా ఈ ఏడాది మే 13న రూపాయలు సోదరుడు పవన్ ఓస్వాల్‌(13)ని కలిసి.. మమతా బాయ్ కాస్తే (45), ఆమె కుమార్తెలు రూపాలి (21), దివ్య (14) లతో పాటు బంధువుల అమ్మాయి పూజా ఓస్వాల్ (15)ని, తాను చెప్పిన ప్రాంతానికి తీసుకువచ్చేలా ఒప్పించాడు.

వారంతా అక్కడికి చేరుకున్న తర్వాత సురేంద్ర వారిని హత్య చేసి... సమీప పొలంలో పది అడుగుల గొయ్యి తీసి మృతదేహాలను పూడ్చి పెట్టాడు. రూపాయితో పాటు మిగతా వారు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కన్న కూతురికి బీరు తాగించిన తండ్రి.. తల్లి కి తెలియడంతో..!...

కేసు నమోదు చేసిన అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో కేసును పక్కదోవ పట్టించడం కోసం సురేంద్ర, రూపాలి సోషల్ మీడియా నుంచి ఆమెలా పోస్టింగులు చేస్తుండేవాడు. తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుని వేరే ప్రాంతంలో ఉంటుందని మిగతా కుటుంబ సభ్యులు తనదగ్గరే ఉన్నారని మెసేజ్లు చేసేవాడు.  

ఈ మెసేజ్ లపై పోలీసులకు అనుమానం రావడంతో చెక్ చేశారు. దాంట్లో సురేంద్ర నెంబర్ కు ఎక్కువ సార్లు కాల్ చేసినట్లు ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అలా అసలు విషయం బయటకు వచ్చింది.

తాను రూపాలిని ప్రేమించానని.. కానీ ప్రస్తుతం వేరే యువతితో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిపాడు. ఇందుకు రూపాలి అంగీకరించలేదని తెలిపాడు. రూపాలి బతికుంటే ఎప్పటికైనా ప్రమాదమే అని భావించి.. ఆమెను, ఆమెతో పాటు తన ప్రేమ గురించి తెలిసిన మిగతా వారిని చంపేశా అన్నాడు.  పోలీసులు సురేంద్ర తో పాటు అతనికి సాయం చేసిన వ్యక్తులను అరెస్టు చేశారు. మృతదేహాలను పూడ్చిన ప్రాంతానికి వెళ్లి జేసీబీ ద్వారా అస్థిపంజరాలు బయటికి తీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios