వినాయక నిమజ్జనంలో అపశ్రుతి..11మంది మృతి
ప్రమాద సమయంలో బోటులో 18 మంది ఉన్నారు. మరణించినవారిని పిప్లానీ నివాసితులుగా గుర్తించారు. చనిపోయినవారి కుటుంబాలకు 4 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి పీసీ శర్మ తెలిపారు. ప్రమాదానికి కారణాన్ని అన్వేషిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్తుండగా నదిలో పడవ బోల్తాపడి 11 మంది మృతిచెందారు. మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతైయ్యారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటుచేసుకుంది.
ఖట్లాపూరా ఘాట్ వద్ద ఉదయం పడవ బోల్తాపడింది. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బోటులో 18 మంది ఉన్నారు. మరణించినవారిని పిప్లానీ నివాసితులుగా గుర్తించారు. చనిపోయినవారి కుటుంబాలకు 4 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి పీసీ శర్మ తెలిపారు. ప్రమాదానికి కారణాన్ని అన్వేషిస్తున్నట్లు ఆయన చెప్పారు.