Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలికతో క్షుద్రపూజలు.. దుస్తులు విప్పితే రూ.50 కోట్లు అంటూ మోసం...

నగ్నంగా పూజలు చేస్తే రూ. 50 కోట్లు వస్తాయని చెప్పి, ఓ మైనర్ పై వేధింపులకు పాల్పడ్డ ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో వెలుగుచూసిన ఈ దారుణ ఘటనలో క్షుద్రపూజల చట్టం కింద కేసు నమోదు చేశారు. 

blace magic : minor girl undressing, five accused arrest at nagpur - bsb
Author
Hyderabad, First Published Mar 1, 2021, 11:03 AM IST

నగ్నంగా పూజలు చేస్తే రూ. 50 కోట్లు వస్తాయని చెప్పి, ఓ మైనర్ పై వేధింపులకు పాల్పడ్డ ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో వెలుగుచూసిన ఈ దారుణ ఘటనలో క్షుద్రపూజల చట్టం కింద కేసు నమోదు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి మైనర్ బాలికను కలిసి తాను చెప్పినట్లు చేస్తే క్షణాల్లో ధనవంతురాలు అవుతావు అంటూ ఓ వ్యక్తి మైనర్ బాలికకు మాయమాటలు చెప్పాడు. తాను చెప్పినట్లు చేస్తే క్షణాల్లో ధనవంతురాలవుతావని నమ్మించాడు. అందుకోసం కొన్ని పూజలు చేయాలని పేర్కొన్నారు. అది నమ్మిన బాలిక పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అంగీకరించింది. 

అయితే, పూజా కార్యక్రమాలు నిర్వహించే టైంలో బాలిక దుస్తులు విప్పాలని ఆ వ్యక్తి చెప్పాడు దీంతో అనుమానం వచ్చిన బాలిక దానికి నిరాకరించింది. కానీ, డబ్బులు కావాలంటే బట్టలు విప్పాల్సిందే అంటూ సదరు వ్యక్తి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో బాలిక వారి చెరనుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. 

జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణమైన విక్కీ గణేష్ ఖాప్రే (20), దినేష్ మహాదేవ్ నిఖారే (25), రామకృష్ణ దాదాజీ మస్కర్ (41), వినోద్ జయరామ్ మస్రం (42), డిఆర్ అలియాస్ సోపాన్ హరిభావు కుమ్రే (35) ప్రధానంగా ఉన్నట్లు నిర్థారించుకున్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు నిందితులపై అసాంఘిక కార్యక్రమాలు, క్షుద్రపూజలు, లైంగిక నేరం, పోక్సో చట్టం, 354 (ఐపిసి)(ఎ), 354 (డి) కింద కేసులు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios