Asianet News TeluguAsianet News Telugu

సిస్టర్ ఫ్రెండ్‌తో శారీరక సంబంధం.. గర్భం దాల్చడంతో మందు కలిపిన డ్రింక్ ఇచ్చి..

బిహార్‌లోని సమస్తిపూర్‌‌లో ఓ దుండగుడు తన సిస్టర్ ఫ్రెండ్‌ను వంచించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ఆమె గర్బం దాల్చిన తర్వాత పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. ఆమె గర్భం దాల్చడంతో ఓ డ్రింక్ ఇచ్చి గర్భస్రావం చేయించాడు.
 

bihar man sexually assaults sister friend on pretext of marriage and made abortion
Author
Patna, First Published May 31, 2022, 5:33 PM IST

పాట్నా: బిహార్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ దుండగుడు సోదరి స్నేహితురాలితో ఫ్రెండ్షిప్ చేశాడు. ఆమెతో శారీరక సంబంధాన్నీ పెట్టుకున్నాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి వంచించాడు. ఆమె గర్భం దాల్చింది. దీంతో మందులు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. ఆమె దానిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకుండా ఆ డ్రింక్ తాగేసింది. ఆ తర్వాత ఆమెకు గర్భస్రావం అయింది. బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

సమస్తిపూర్‌కు చెందిన ఓ దుండగుడు సిస్టర్ ఫ్రెండ్‌ను మోసం చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అబద్ధాలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత తరుచూ తనను పెళ్లి చేసుకోవాలని ఆ అబ్బాయిని ఆమె ప్రాధేయపడింది. కానీ, ఆ దుండగుడు ఆమె విజ్ఞాపనలను పెడ చెవిన పెట్టాడు. పెళ్లి కోసం ఆమె ఎంతో ప్రయత్నించింది. చివరకు ఆమె తల్లిదండ్రులకూ విషయం చెప్పింది. తనతో సంబంధం పెట్టుకున్నవాడి వద్దకు వెళ్లి పెళ్లికి ఒప్పించాలని కూడా కోరింది. కానీ, ఆమె తల్లిదండ్రులు ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. 

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ దుండగుడు ఆ అమ్మాయిని ఓ క్లినిక్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడే అబార్షన్‌కు ఎత్తుగడ వేశాడు. డ్రింక్‌లో మందులు కలిపి చేతికి ఇచ్చాడు. ఆమె ఆ డ్రింక్ తాగేసింది. అనంతరం ఆమెకు గర్భస్రావం అయింది. అబార్షన్ తర్వాత ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆమెను ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. 

అబార్షన్ తర్వాత ఆమె ఆ దుండగుడిపై పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చింది. ఆ అమ్మాయి ఫిర్యాదు, మెడికల్ టెస్టు రిపోర్టుల ఆధారంగా తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఎస్‌హెచ్‌వో కుమార్ బ్రజేశ్ వెల్లడించారు. ప్రస్తుతం దుండగుడు పరారీలో ఉన్నాడు. అరెస్టు కోసం గాలింపులు జరుపుతున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఓ మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... బాపట్ల జిల్లా (bapatla district)లోని కొరిశపాడు మండలంలో రావిపాటి కోటయ్య వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. అతడికి పెళ్ళయి భార్యతో కలిసే వుంటున్నాడు. ఇలా మంచి ఉద్యోగం, భార్యతో ఆనందంగా సాగుతున్న జీవితాన్ని అతడు చేజేతులా నాశనం చేసుకోవడమే కాదు మరో చిన్నారి జీవితంతో ఆడుకున్నాడు. 

ఇంట్లో భార్య వున్నప్పటికీ నీచపు ఆలోచనలతో రగిలిపోయిన కోటయ్య అదే గ్రామానికి చెందిన 15ఏళ్ల మైనర్ బాలికపై కన్నేసాడు. తండ్రిదండ్రులు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో బాలిక అమ్మమ్మ వద్దే వుంటోంది. దీంతో బాలికను ఏంచేసినా గట్టిగా అడిగేవారెవరూ లేరని భావించాడో ఏమో వాలంటీర్ కోటయ్య దారుణానికి ఒడిగట్టాడు.

మాయమాటలు చెప్పి బాలికతో పరిచయం పెంచుకున్న అతడు గత మూడునెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొందంటూ బెదిరించడంతో బాలిక అలాగే చేసింది. ఇలా వాలంటీర్ చేతిలో ఆటబొమ్మగా మారింది చిన్నారి.  

Follow Us:
Download App:
  • android
  • ios