Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగంకోసం వచ్చిన యువతిని బంధించి.. 4 నెలలుగా తండ్రీకొడుకుల అత్యాచారం.. రూ.60వేలకు అమ్మకం..

మధ్యప్రదేశ్లోని భోపాల్ లో దారుణం జరిగింది. ఓ తండ్రి కొడుకులు దారుణానికి పాల్పడ్డారు. ఓ మహిళను కొన్ని నెలల పాటు నిర్బంధించి.. ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు ఆ తర్వాత బాధితురాలిని ఓ వ్యక్తికి రూ. 60 వేలకు అమ్మేశారు.

Bhopal : Father-son duo sells woman for Rs 60,000 after raping her for months - bsb
Author
Hyderabad, First Published Jul 14, 2021, 4:28 PM IST

ఉద్యోగం కోసం వెతుకుతున్న మహిళకు మాయమాటలు చెప్పి మొదట తండ్రి, ఆ తరువాత కొడుకు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇంతటితో ఆగకుండా ఆమెను నెలలపాటు బంధించి తమ కామ వాంఛ తీర్చుకున్నారు. ఆ తరువాత రూ.60వేలకు అమ్మేశారు. భయాందోళనలు కలిగించే ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.  

మధ్యప్రదేశ్లోని భోపాల్ లో దారుణం జరిగింది. ఓ తండ్రి కొడుకులు దారుణానికి పాల్పడ్డారు. ఓ మహిళను కొన్ని నెలల పాటు నిర్బంధించి.. ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు ఆ తర్వాత బాధితురాలిని ఓ వ్యక్తికి రూ. 60 వేలకు అమ్మేశారు.

భోపాల్ నగరంలో జరిగిన ఈ దారుణం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. బాధితురాలని పెళ్లి చేసుకునేందుకు సదరు వ్యక్తి తండ్రి కొడుకులతో డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వివాహం గురించి తెలియడంతో వారు ఆమెను రక్షించి భర్తను అరెస్టు చేశారు.

ఉద్యోగ వేటలో ఉన్న బాధితురాలికి నాలుగు నెలల క్రితం రవి పరిచయమైన ట్లు పోలీసులు తెలిపారు ఈ క్రమంలో నిందితుడు ఆమెపై ఓ రోజు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ తరువాత అతని తండ్రి రమేష్ కూడా ఈ దారుణానికి తెగించడం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 ప్రజాపతి అనే వ్యక్తితో తనపై తండ్రి కొడుకులు దారుణానికి ఒడిగట్టి ఉంటారని ఆమె పేర్కొంది పరారీలో ఉన్న తండ్రి కొడుకుల కోసం పోలీసులు ప్రస్తుతం విస్తృతంగా గాలిస్తున్నారు 

Follow Us:
Download App:
  • android
  • ios