నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్.. ఎందుకంటే..
దీనికోసం ఇన్స్టాగ్రామ్ను మాధ్యమంగా ఎన్నుకున్నారు. గడ్కరీతో దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ కృతజ్ఞతగా ఓ పోస్టు కూడా రాశారు.
ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నితిన్ గడ్కరీ మీద ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీకి అనేక విధాల సోమవారం కృతజ్ఞతలు తెలిపారు.
దీనికోసం ఇన్స్టాగ్రామ్ను మాధ్యమంగా ఎన్నుకున్నారు. గడ్కరీతో దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ కృతజ్ఞతగా ఓ పోస్టు కూడా రాశారు.
"ఇన్ని సంవత్సరాలుగా మీరు నా పక్షాన ఉన్నందుకు నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితంలోని ప్రతి అంశంలోనూ మీరు నాకు బేషరతుగా మద్దతు ఇచ్చారు. నేను దానిని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఖచ్చితంగా చెప్పగలను. @గడ్కరీ. నితిన్ జీ, మీరు చేసిన ప్రతి పనికి చాలా ధన్యవాదాలు. మీరు ఇలాగే నా శ్రేయస్సు కోసం సాయం చేస్తూనే ఉండండి "అని సంజయ్ దత్ పోస్ట్ పెట్టారు.
ఈ నోట్ తో పాటు సంజయ్ దత్, నితిన్ గడ్కరీ, నిర్మాత జే పటేల్తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. ఈ పోస్టులో నితిన్ గడ్కరీతో పాటు నిర్మాత జే పటేల్ ను కూడా సంజయ్ దత్ ప్రశంసించారు.
"జై పటేల్, నా జీవితంలో అడుగడుగునా నాకు అండగా నిలిచినందుకు, పిల్లర్ ఆఫ్ స్ట్రెంథ్ గా ఉన్నందుకు ధన్యవాదాలు" అని ఆయన అన్నారు. ప్రస్తుతం సంజయ్ దత్ రణ్బీర్ కపూర్, వాణి కపూర్ కలిసి నటించిన '' శంషేరా '' లో కనిపించనున్నారు. దీంతోపాటు '' K.G.F చాప్టర్ 2 '' లో కూడా సంజయ్ అలరించనున్నారు.