Asianet News TeluguAsianet News Telugu

బాలికపై బంధువులే సామూహిక లైంగిక దాడి.. 80యేళ్ల వృద్ధుడితో పాటు, మరో ఐదుగురు.. సహకరించిన పెద్దమ్మ...!!

రెండు రోజుల ముందు విద్యార్థి అనారోగ్యం బారిన పడడంతో బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలిక నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణంలో ఆమెకు వరసకు అన్న అయిన మోహన్ మొదట విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడని తరువాత మిగిలిన వారు అత్యాచారం చేసినట్లు తెలిసింది. దీనికి సహకరించిన పెద్దమ్మ కుప్పును అరెస్ట్ చేశారు.

80 years old and five relatives molestation minor girl in tamilnadu
Author
Hyderabad, First Published Jan 12, 2022, 9:03 AM IST

తమిళనాడు : విల్లుపురం, సెంజి సమీపంలోని ఈ చంకుప్పానికి చెందిన 16యేళ్ల బాలిక మీద బంధువులే సామూహిక sexual assaultకి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. 80 వృద్ధుడితో కలిసి minor girlను మరో ఇద్దరు యువకులు కూడా బలాత్కారం చేసినట్లు తెలిసింది. 

ఈ కేసులో 80 యేళ్ల వృద్ధుడు వెంకటేశన్ పెద్ద కుమారుడు మోహన్, ఇతని స్నేహితుడు ఇళయరాజా తదితరులను పోలీసులు arrest చేశారు. పోలీసు కథనం మేరకు లైంగిక దాడికి గురైన బాలిక పదిహేనేళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆమె కోవైలో ఉన్న శరణాలయంలో ఉంటూ ప్లస్ వన్ చదువుకుంటోంది.

సెలవు రోజుల్లో సెంజి సమీపంలో ఉన్న ఈచంకుప్పం ప్రాంతంలోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో రెండు రోజుల ముందు విద్యార్థి అనారోగ్యం బారిన పడడంతో బంధువులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలిక నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణంలో ఆమెకు వరసకు అన్న అయిన మోహన్ మొదట విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడని తరువాత మిగిలిన వారు అత్యాచారం చేసినట్లు తెలిసింది. దీనికి సహకరించిన పెద్దమ్మ కుప్పును అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఐదుగురిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

ఇలాంటి దారుణమే నాలుగు రోజుల క్రితం పూణేలో చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని 16 నెలల పసికందుపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత కనికరం లేకుండా గొంతు నులిమి murder చేశాడు. ఈ ఘాతుకానికి పసిగుడ్డు mother సహకరించడం అమ్మతనానికే మాయని మచ్చ.. చిన్నారి మృతదేహాన్ని సొంతూరికి తరలించేందుకు రైలెక్కగా  ప్రయాణికుల అనుమానంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితులు గుజరాత్లోని రాజ్కోట్లో వెళ్తుండగా.. మహారాష్ట్రలోని షోలాపూర్ రైల్వే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజ్కోట్ కు చెందిన దంపతులు సికింద్రాబాద్ లోఉంటున్నారు. కన్నకూతురిపై  తండ్రి (26) ఈ నెల 3న ఇంట్లో లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు. ఈ ఘోరానికి తల్లి కూడా సహకరించింది. తాము చేసిన ఘోరం మూడో కంటికి తెలియకుండా ఉండేందుకు వారు మృతదేహాన్ని రాజ్ కోట్ కి తీసుకెళ్లాలని భావించారు.  

సికింద్రాబాదులో రాజ్ కోట్ రైలెక్కారు. అయితే ఎంతసేపయినా పాపలో చలనం లేకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు విషయాన్ని టీటీఈకి తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... సోలాపూర్ లో వారిని దింపేసారు.  పోక్సో సహా పలు సెక్షన్ల కింద దంపతులపై కేసు నమోదు చేశారు.

కాగా, West Godavari జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని Five-year-old girlపై ఓ యువకుడు molestation చేశాడు. ఈ ఘటన జంగారెడ్డిగూడెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత రెండు మూడు రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకోవడంతో parents బాలికను గట్టిగా మందలించారు. దీంతో బాలిక అసలు విషయాన్ని బయటపెట్టింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను పోలీసులు ఏలూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios