ఉత్తరప్రదేశ్ లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లి స్కార్పియో వాహనంలో తిరిగి వస్తుండగా ఓ ఇసుక లారీ ఢీ కొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు.
ఉత్తరప్రదేశ్ కౌశాంబి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం బందువుల ఇంట్లో జరిగిన పెళ్లివేడుకను ముగించుకుని ఓ మదిమంది తమ స్వస్థలానికి స్కార్పియో వాహనంలో బయలుదేరారు. అయితే తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ఇసుక లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మృతదేహాలను కూడా వాహనంలోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్కార్పియోలో ప్రయాణిస్తున్న పదిమందిలో ఎనిమిది మంది మృతిచెందగా కేవలం ఇద్దరు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా శుభకార్యానికి వెళ్లిన వారు మృతదేహాలుగా తిరిగి రావడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నిండింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 2, 2020, 10:40 AM IST