Asianet News TeluguAsianet News Telugu

Kanpur Duble Murder Case: మిస్టరీ వీడింది.. క‌న్న తండ్రే.. కొడుకు, కోడ‌లు పీక‌ల‌ను కోసాడు

Kanpur Duble Murder Case: కాన్పూర్‌లో జంట హత్యల మిస్టరీ వీడింది. కొడుకు, కోడలును వృద్ధ తండ్రే హత్య చేశాడని పోలీసులు ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
 

74 year old father committed the murder of his own son and daughter in law
Author
Hyderabad, First Published May 20, 2022, 5:25 AM IST

Kanpur Duble Murder Case: పిల్లలను కాపాడుకోవడానికి తండ్రి ఎంతకైనా తెగిస్తాడని అంటారు. కానీ ఈ కలియుగంలో ఏం జరుగుతుందో చెప్పలేం, అవును కాన్పూర్‌లో జంట హత్య కేసులో అస‌లు నిజం వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసులో 74 ఏళ్ల వృద్ధుడు తన కొడుకు, కోడలును అత్యంత దారుణంగా గొంతులు కోసి.. విచ‌క్ష‌ణ ర‌హితంగా పొడిచి హత్య చేశాడు. కాన్పూర్‌లోని బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంబాగ్‌లో ఒక జంట హత్య కేసు సంఘటన జరిగిన కొద్ది గంటలకే  నిందితుడిని పోలీసులు వెల్లడించారు. 

వివ‌రాల్లోకెళ్తే.. నిందితుడు దీప్ తివారీ తన కొడుకు శివ‌మ్, కోడలు జూలీతో కలిసి బజారియాలో నివసించాడు. ఏడాది క్రితం శివమ్.. జూలీని ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా నెల రోజుల తర్వాత డబ్బు విషయంలో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. 

ఈ క్ర‌మంలో బుధవారం రాత్రి నిద్రిస్తున్న‌ శివం, అతని భార్య జూలీ నిందితుడు దీప్ తివారీ అర్థ‌రాత్రి స‌మ‌యంలో వారిపై దాడి చేసి.. వారి పీక‌ల‌ను కోసి..విక్ష‌చ‌ణ ర‌హితంగా పొడిచి హ‌త్య చేశాడు. హ‌త్య చేయ‌డానికి వాడిన క‌త్తిని శుభ్రంగా క‌డిగి భ‌ద్ర‌ప‌రిచాడు. అనంత‌రం అక్క‌డ నుంచి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వీరిద్దరి హత్యకు గురైన‌ట్టు ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత దుండ‌గులు ఇంట్లో చోరీ పాల్ప‌డి.. వారిని హ‌త్య చేసి ఉండ‌వ‌చ్చ‌ని 
భావించారు. 

అయితే.. పోలీసుల ప్రాథమిక విచారణలో పదునైన ఆయుధంతో హత్య చేశారని, అలాగే హంతకుడు ఇంటి నుంచి వచ్చాడనే పోలీసులు భావించారు. ఈ క్రమంలో పోలీసులు ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించారు. తొలుత  నిందితుడు దీప్ ను విచారించారు. తొలుత అస‌లు విష‌యాన్ని ప్ర‌య‌త్నం చేశాడు. కానీ పోలీసులు త‌మదైన శైలిలో విచారించ‌గా.. అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. 

కాన్పూర్‌లో భార్యాభర్తల హత్యకు సంబంధించిన ప్రాథమిక విచారణలో పోలీసులు పదునైన ఆయుధంతో హత్య చేశారని, అలాగే హంతకుడు ఇంటి నుంచి వచ్చాడనే భయంతో పోలీసులు చెప్పడం గమనించాలి. పోలీసులు ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించారు మరియు అతని విచారణ తరువాత, ఈ జంట హత్య బయటపడింది. తొలుత కోడలును హతమార్చి కొడుకు మెడ కోసుకుని హత్య చేసిన‌ట్టు నిందితుడు ఒప్పుకున్నారు.  

ఈ జంట హత్యల కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెస్ట్ డీసీపీ బీబీ జీటీఎస్ మూర్తి తెలిపారు. ఇంట్లో గొడవల కారణంగానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. కాన్పూర్‌లోని బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో, పోలీసులు రెండు గంటల్లో జంట హత్యను వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios