Most Polluted Places: భారతదేశంలో ఈ ఏడాది వాయు కాలుష్యం అత్యంత దారుణంగా మారిందని స్విట్జర్లాండ్కు చెందిన IQAir అనే సంస్థ విడుదల చేసిన ప్రపంచ వాయు నాణ్యత నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్న 100 నగరాల్లో భారత్లోనే 63 ఉన్నట్లు నివేదిక తెలిపింది.
Most Polluted Places: దేశంలో రోజురోజుకు గాలి కాలుష్యం అత్యంత తీవ్రమవుతున్నట్టు ప్రపంచ వాయు నాణ్యత నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారత్లో గతేడాదితో పోల్చితే.. ఈ ఏడాది వాయు కాలుష్యం అత్యంత తీవ్రంగా ఉన్నట్టు స్విట్జర్లాండ్కు చెందిన IQAir రూపొందించిన నివేదిక తెటతెల్లం చేసింది.
ఈ నివేదిక ప్రకారం.. భూమ్మీద ఉన్న100 అత్యంత కాలుష్య నగరాల్లో భారత్కు చెందిన 63 నగరాలు ఈ జాబితాలో ఉండటం షాకింగ్ కు గురి చేస్తుంది. ప్రాణాంతక, మైక్రోస్కోపిక్ PM2.5 కాలుష్య కారకంలో కొలవబడిన సగటు వాయు కాలుష్యం, క్యూబిక్ మీటరుకు 58.1 మైక్రోగ్రాములు.. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వాయు నాణ్యత మార్గదర్శకాల కంటే 10 రెట్లు ఎక్కువ. భారతదేశంలోని ఏ నగరమూ WHO ప్రమాణాన్ని అందుకోకపోవడం చెప్పుకోదగ్గ అంశం. ఉత్తర భారతదేశంలో ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది.
ప్రపంచంలో అత్యంత కాలుష్యకార రాజధాని నగరాల జాబితాలో ఢిల్లీ వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో నిలిచింది. ముందు ఏడాదితో పోల్చితే ఢిల్లీలో 2021లో 15 శాతం మేర కాలుష్యం పెరిగింది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే ఢిల్లీలో వాయు కాలుష్యం దాదాపు 20 రెట్లు అధికంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంలో రాజస్థాన్లోని భివాండీ తొలిస్థానం దక్కించుకోగా... యూపీలోని ఘాజియాబాద్ రెండో స్థానంలో, చైనా నగరం హోటన్ మూడో స్థానంలో.. ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచాయి.
ఈ జాబితాలోని టాప్ 15లోని 10 భారతీయ నగరాలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. మొత్తం 63 నగరాలు ఉండగా.. సగానికి కంటే ఎక్కువ హరియాణా, ఉత్తర్ ప్రదేశ్లకు చెందినవే కావడం గమనార్హం. టాప్ 15లో ఒకటి చైనా, నాలుగు పాకిస్థాన్, మిగతా 10 భారతీయ నగరాలే.
చికాగో విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన గాలి నాణ్యత 'లైఫ్ ఇండెక్స్' ప్రకారం.గాలి నాణ్యత స్థాయిలు WHO ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే.. ఢిల్లీ, లక్నో వాసితుల ఆయుర్దాయం దాదాపు ఒక దశాబ్దాన్ని పెరుగుతుందని తెలిపింది.
వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా
1, వాహన ఉద్గారాలు,
2, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు,
3,పారిశ్రామిక వ్యర్థాలు,
4, వంట కోసం బయోమాస్ దహన
5 నిర్మాణ రంగం
భారత్లో ఈ వాయుకాలుష్యం సంక్షోభం విలువ ఏటా 150 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు అంచనా. అంతేకాదు, ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. కాలుష్యంతో ప్రతి నిమిషానికి ముగ్గురు ప్రాణాలు కోల్పోతుంటే.. గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల సహా అనేక అనారోగ్య సమస్యలతో జనం సతమతమవుతున్నారు. గతేడాది చెన్నై మినహా ఆరు మెట్రో నగరాల్లో కాలుష్య స్థాయిలు పెరిగాయి.
ప్రభుత్వ నివేదిక సైతం ఢిల్లీ, కోల్కతా, ముంబయిలో కాలుష్యం తీవ్రంగా ఉన్నట్టు వెల్లడించింది. ఢిల్లీలో గతేడాది 168 రోజులు వాయు నాణ్యత క్షీణించిందని, ముందు ఏడాదితో పోల్చితే ఇది 21 శాతం అధికమని ఇటీవల ఓ పార్లమెంట్ నోట్ తెలిపింది. కోల్కతాలో 83 రోజులు (2020లో 74 రోజులు), ముంబయిలో 39 రోజులు (2020లో 20 రోజులు) కాలుష్యం తీవ్రంగా ఉంది.
కాగా, 2020 ప్రపంచ వాయు నాణ్యత నివేదికను భారత్ కొట్టిపారేయడం గమనార్హం. ఈ ర్యాంకులకు ప్రామాణికత లేదని, కేవలం ఉపగ్రహాల ద్వారానే సమాచారం సేకరిస్తారని తోసిపుచ్చింది. ఇక, పొరుగు దేశం చైనాలో వాయు నాణ్యత పెరుగుతూ ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఆ దేశ రాజధాని బీజింగ్ నగరంలో వాయు కాలుష్యం ఐదేళ్ల కనిష్ఠానికి చేరింది. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు కార్యకలాపాలు తగ్గించడం సహా అనేక చర్యల వల్ల కాలుష్యం నియంత్రించిందని తెలిపింది.
దేశంలోనే కాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతంగా తమిళనాడులోని అరియలూర్ నిలిచింది. అయితే, ఇక్కడ కూడా కాలుష్యం డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు మూడు రెట్లు మించి ఉండటం గమనార్హం.
