Asianet News TeluguAsianet News Telugu

లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫోర్ వీలర్ వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో ఐదుగురు మృతి చెందారు. 

5 dead in road accident up lakhimpur kheri
Author
First Published Nov 22, 2022, 10:57 AM IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫోర్ వీలర్ వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. షాజహాన్‌పూర్ నుంచి కూలీలతో వెళ్తున్న కారు..  పాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే క్రాసింగ్ సమీపంలో అదుపు తప్పి లోయాలో పడింది. ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 10 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లఖింపూర్ ఖేరీలోని భీరా రోడ్డుపై ఫోర్ వీలర్ వాహనం బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించినట్టుగా చెప్పారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios