5 కోట్ల పోస్ట్కార్డులు, థాంక్స్ పీఎం బ్యానర్లు ... 20 రోజుల పాటు మోడీ బర్త్ డే సెలబ్రేషన్స్
ప్రధాని నరేంద్ర మోడీ 71వ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల అధ్యక్షులకు సూచనలు జారీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ 71వ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా బీజేపీ భారీ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ 17న మోదీ పుట్టిన రోజు నాడు ప్రజా సేవలో 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ‘‘సేవా, సమర్పణ్, అభియాన్’’ పేరిట 20 రోజుల పాటు మెగా ఈవెంట్ నిర్వహించాలని కమలనాథులు నిర్ణయించారు. దీనిలో భాగంగా 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల అధ్యక్షులకు సూచనలు జారీ చేశారు.
ALso Read:ప్రపంచంలోనే హై పాపులారిటీ లీడర్.. ప్రధాని నరేంద్ర మోడీ.. వెల్లడించిన అమెరికన్ సర్వే
మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని కోవిడ్ సమయంలో ఉచితంగా ఆహారధాన్యాలు సరఫరా చేసినందుకు, కోవిడ్ టీకా వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ‘‘ థ్యాంక్స్ పీఎం బ్యానర్లు’’ ఏర్పాటు చేయాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. అంతేకాక బూత్ స్థాయి నుంచి మోడీని అభినందిస్తూ 5 కోట్ల పోస్ట్ కార్డులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కార్యకర్తలందరూ సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ వీడియో క్లిప్ రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని బీజేపీ అధిష్టానం సూచించింది.