Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేటు బస్సులో మంటలు.. చిన్నారి సహా ఐదుగురు సజీవదహనం

మంటలు చెలరేగగానే ప్రయాణికులు బస్సులో నుంచి కిందకు దూకేశారు. అయితే.. ఐదురుగు మాత్రం మంటల నుంచి బయటకు రాలేక మృతి చెందారు.

5 Charred to death After Private Bus catches fire in Karnataka
Author
Hyderabad, First Published Aug 12, 2020, 9:25 AM IST

కర్ణాటకలో హోర ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హరియూరు దగ్గర ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారితోపాటు.. ఓ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కాగా.. ప్రైవేటు బస్సులు బెంగళూరు నుంచి విజయపురకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. మంటలు చెలరేగగానే ప్రయాణికులు బస్సులో నుంచి కిందకు దూకేశారు. అయితే.. ఐదురుగు మాత్రం మంటల నుంచి బయటకు రాలేక మృతి చెందారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతా నిద్ర మత్తులో ఉన్నారు. ఇక ఈ ఘోర ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.  కాగా.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.   ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios