2 ఏళ్ల బాలుడిని కొట్టి కప్బోర్డులో పెట్టిన మహిళ, మృతి
ఇద్దరు మహిళల మధ్య గొడవ రెండళ్ల బాలుడి మరణానికి కారణమైంది. ఈ డెడ్ బాడీని ఆరుగంటలపాటు కప్బోర్డులో దాచిపెట్టింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
కోల్కతా: ఇద్దరు మహిళల మధ్య గొడవ రెండళ్ల బాలుడి మరణానికి కారణమైంది. ఈ డెడ్ బాడీని ఆరుగంటలపాటు కప్బోర్డులో దాచిపెట్టింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. తజ్మీరా బిబీ, షంషా బీబీ మధ్య బంధుత్వం ఉంది. వీరిద్దరి మధ్య చోటు చేసుకొన్న ఏవో కారణాలతో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే ఈ నెల 7వ తేదీ నుండి ఆడుకొంటున్న రెండేళ్ల బాలుడు కన్పించకుండా పోయారు. కన్పించకుండా బాలుడు తజ్మీరా బిబీ ఇంట్లోని కప్ బోర్డులో కన్పించాడు. ఆరు గంటల పాటు ఈ కప్ బోర్డులోనే బాలుడు ఉన్నాడు.
తన కొడుకును కొట్టినందుకు తజ్మీరా బీబీ... షంషా బీబీ కొడుకును కొట్టింది. దీంతో ఆ బాలుడు కోమాలోకి వెళ్లాడు. వెంటనే ఆ బాలుడిని తన కప్ బోర్డులో ఉంచింది. ఆరు గంటల పాటు కప్ బోర్డులో ఉంచింది.
ఈ బాలుడి మృతితో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.పోలీసులు తజ్మీరా బీబీని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.