Asianet News TeluguAsianet News Telugu

బాత్రూంలో స్నానం చేస్తుంటే.. పక్కింటి యువకుడు అత్యాచారం.. ఆర్నెళ్ల గర్భవతిగా తేలడంతో...

బాత్రూంలో స్నానం చేయడానికి వెడుతున్న బాలికను అదే స్నానాల గదిలో అత్యాచారం చేశాడో యువకుడు. ఆ అమ్మాయి గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

18years old girl raped by neighbour and got pregnant in rajasthan
Author
First Published Nov 22, 2022, 10:40 AM IST

రాజస్థాన్ : ఆ బాలిక వయస్సు 18 సంవత్సరాలు. పదోతరగతి చదువు ఆపేసి, ఇంటి దగ్గరే ఉంటుంది. కొద్దిరోజులుగా ఆ అమ్మాయి కడుపునొప్పితో బాధపడుతుంది. దీంతో తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. అక్కడ వైద్యులు అన్ని పరీక్షలు చేసి.. ఆ అమ్మాయి ఆరు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో తల్లి షాక్ కు గురయింది. వెంటనే బాలిక నిలదీయగా.. ఆమె అసలు విషయం చెప్పింది. ఆరునెలల క్రితం బాత్రూంలో స్నానం చేస్తుండగా.. పక్కింటి యువకుడు తనపై అత్యాచారం చేసినట్టు బయటపెట్టింది.

రాజస్థాన్ లోని జైపూర్ కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆరు నెలల క్రితం స్నానం చేయడానికని బాత్రూంకి వెళ్ళింది. ఆ సమయంలో పక్కింట్లో ఉంటున్న ఓ యువకుడు బలవంతంగా బాత్రూంలోకి ప్రవేశించాడు. బాలికపై బాత్రూంలోని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక భయంతో ఎవరికీ అత్యాచారం గురించి చెప్పలేదు. నెలరోజుల తరువాత ఆ యువకుడు గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.

గ్యాస్ లీకేజ్.. స్పృహ తప్పి పడిపోయిన అగ్నిమాపక సిబ్బంది..

శుక్రవారం అమ్మాయికి కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి చూపించగా, అసలు విషయం బయటపడింది. బాలిక ఆరు నెలల గర్భవతి అని డాక్టర్లు చెప్పారు. దీంతో బాలిక తనమీద జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై ఒక దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ ఘటనను అంతా ఫోన్ లో రికార్డు చేశాడు. ఈ వీడియోను చూసిన ఆమె భర్త మనస్థాపానికి గురయ్యాడు. తీవ్ర వేదనతో, అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల... పింపల్ గ్రామానికి చెందిన ఓ వివాహితకు ఓ దుండగుడు మత్తుమందు ఇచ్చాడు. 

ఆ తరువాత స్పృహ కోల్పోయిన ఆమె మీద రవి దత్తాత్రేయ అనే వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతే కాకుండా దాన్ని మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ తరువాత  ఆ వీడియోలను ఆమె భర్తకు పంపించాడు. అది చూసి భర్త షాక్ అయ్యాడు. ఆ తరువాత మనస్తాపానికి గురైన వివాహిత భర్త.. సమాజంలో పరువు పోతుందని.. విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.. ఈ ఘటనలో ముగ్గురు పురుషులతో పాటు ఇద్దరు మహిళల పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios