ప్రియుడి మోజులో.. తల్లికి అన్నంలో నిద్రమాత్రలు కలిపిచ్చి.. 14యేళ్ల బాలిక చేసిన పని...!
పెళ్లి చేసుకుంటానని ప్రియుడు చెప్పిన మాయమాటలు నమ్మి, అతడు తెచ్చిచ్చిన నిద్రమాత్రలను అన్నంలో కలిపి తల్లికి ఇచ్చింది. అన్నం తిన్న తరువాత రాత్రి 9.30 గంటల సమయంలో ఆ తల్లీ కూతుళ్లిద్దరూ నిద్రకు ఉపక్రమించారు. పక్క గదిలో తండ్రి నిద్రపోయాడు. ఆ తరువాత...
పంజాబ్ : పద్నాలుగేళ్ల కూతురితో గదిలో పడుకున్న తల్లి తెల్లారి లేచి చూసే సరికి పక్కన పడుకున్న కూతురు కనిపించలేదు. అంతా వెతికి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో భర్తకు విషయం చెప్పింది. అతడు, బంధువులను ఆరా తీశాడు. ఎవరింటికీ రాలేదని తేలింది.
దీంతో భర్త, భార్య మీద ఆగ్రహానికి వచ్చాడు. ఇంట్లో పక్కన పడుకున్న కూతురు ఎలా మాయమయ్యింది. నీకు తెలియలేదా అంటూ భార్యను కోపడ్డాడు. అప్పుడు భార్యకూ అనుమానం వచ్చింది. రోజూ రాత్రివేళ్ల 2,3 సార్లైనా లేచే తాను.. ఉదయం 7 గంటలవరకు ఒక్కసారి కూడా మెలుకువ రాలేదేంటా అని అనుమానం వచ్చింది.
దీంతో గదిలో వెతికితే నిద్రమాత్రలు కనిపించాయి. అప్పటికానీ వారికి అసలు విషయం అర్థం కాలేదు. తల్లికి అన్నంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి, ఆమె గాఢ నిద్రలోకి వెళ్లిన తరువాత కూతురు ఇంట్లోంచి వెళ్లిపోయిందని గ్రహించారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడే దీనికి కారణమని అనుమానించారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పంజాబ్ లోని జలంధర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. జలంధర్ లో ఉండే ఓ భార్యాభర్తలకు 14 యేళ్ల కుమార్తె ఉంది. వీరు స్తానికంగా చిన్న దుకాణం నడుపుతూ జీవిస్తున్నారు. అదే ప్రాంతంలో ఉండే భజన్ మణీ అనే కుర్రాడితో ఆ బాలిక ప్రేమలో పడింది.
ఈ విషయం తెలిసి ఆ బాలిక తల్లిదండ్రులు అతడిని చాలాసార్లు హెచ్చరించారు. దీంతో ఇద్దరూ కలిసి ఇంటినుంచి పారిపోవాలనుకున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పడంతో అతడి మాటలకు ఓకే చెప్పింది. అతడు తెచ్చిచ్చిన నిద్రమాత్రలను అన్నంలో కలిపి తల్లికి ఇచ్చింది. అన్నం తిన్న తరువాత రాత్రి 9.30 గంటల సమయంలో ఆ తల్లీ కూతుళ్లిద్దరూ నిద్రకు ఉపక్రమించారు. పక్క గదిలో తండ్రి నిద్రపోయాడు.
అర్థరాత్రి టైంలో ఆ బాలిక తన ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ తల్లి స్మార్ట్ ఫోన్ ను కూడా తీసుకువెళ్లింది. ఉదయం లేచి చూస్తే గానీ విషయం అర్థం కాలేదు. దీంతో భజన్ మణీ మీద తన కూతుర్ని కిడ్నాప్ చేశాడంటూ జలంధర్ పోలీసులకు ఆ భార్యాభర్తలిద్దరూ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె తీసుకెళ్లిన స్మార్ట్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా వరి ఆచూకీని తెలుసుకునే పనిలో పడ్డారు.