North Korea Cryptocurrency Hack: ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్లు బ్లాక్ చైయిన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్ ఛేంజిల్లోకి చొరవడి సొమ్ము కాజేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఒక్క దెబ్బకు రూ. 4,500 కోట్ల మేరకు క్రిప్టో కరెన్సీలకు దోచుకున్నట్టు FBI నిర్ధారించింది
North Korea Cryptocurrency Hack: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఆయన ఏది చేసినా సంచలనే. ఎప్పుడు తన వింత వైఖరితో, చిత్రవిచిత్రం ఆంక్షాలతో తన దేశ ప్రజలను భయభంత్రులకు గురిచేస్తారు. కానీ ఈ సారి మాత్రం ప్రపంచ దేశాలను షేక్ చేశాడు.. అతని సేన( బృందం) చేసిన పనికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అగ్రదేశం సైతం భయపడుతోందంటే.. అతిశయోక్తి కాదు. ఇంతటి ఏం చేశారు? ఎందుకింత భయపడుతున్నారని అనుకుంటున్నారా? అసలు విషయం తెలిసిందే.. మీకు కూడా.. దిమ్మ తిరిగిపో.. మైండ్ బ్లాక్ అవుతోంది.
కిమ్ ఆదేశాల మేరకు ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అత్యంత హై సెక్యూరిటీ ప్యూచర్స్ ఉండే...బ్లాక్ చైయిన్ టెక్నాలజీతో నడిపించే క్రిప్టోల ఎక్స్ ఛేంజిల్లోకి చొరబడి.. దోచేస్తున్నారు. ఇలానే తాజాగా రూ. 4,500 కోట్ల మేరకు క్రిప్టో కరెన్సీని కాజేసినట్టు తెలిసింది. గత నెల 23న క్రిప్టో కరెన్సీని సంపాదించడానికి ఆడే యాక్సిస్ ఇన్ఫినిటీ గేమ్లోని ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ బృందాలైన లాజరస్ గ్రూప్, APT38 లు DPRKతో ఇథేరియం అనే కంపెనీకి చెందిన 620 మిలియన్ డాలర్ల క్రిప్టోకరెన్సీ అపహరించాయి. ఈ విషయాన్ని FBI పరిశోధన అనంతరం నిర్ధారించింది.
ఉత్తర కొరియాకు ప్రపంచ కరెన్సీ డాలర్లను ఇవ్వం అంటూ అమెరికా ఆంక్షలు విధిస్తే.. వాటిని తప్పించుకొని ఏకంగా క్రిప్టో కరెన్సీలను వినియోగించడం మొదలుపెట్టింది. దీంతో అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ గురువారం లాజరస్ గ్రూప్పై ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియా ప్రభుత్వం కోసం క్రిప్టోలను సంపాదించేందుకు ఈ గ్రూపు పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ శాఖ ఈ గ్రూపు వినియోగించే వాలెట్పై కూడా ఆంక్షలు ప్రకటించింది.
కొరియా అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్-ఉన్ను హాస్యభరితంగా చిత్రీకరించిన చలనచిత్రంతో సహా వివాదాస్పద డేటాను లీక్ చేసిన సోనీ పిక్చర్స్ అప్రసిద్ధ హ్యాకింగ్తో దీని పేరు గతంలో ముడిపడి ఉంది. ఇది WannaCry ransomware దాడులతో పాటు అంతర్జాతీయ బ్యాంకుల హ్యాకింగ్తో కూడా సంబంధం కలిగి ఉంది. కానీ మునుపెన్నడూ సమూహం క్రిప్టో దోపిడీకి లింక్ చేయబడలేదు.
ఇలా హ్యాకింగ్ చేయగా వచ్చిన సోమ్మును ఆయుధాలు మరియు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం ఆదాయాన్ని సంపాదించడానికి సైబర్ క్రైమ్తో సహా అక్రమ కార్యకలాపాలపై ఎక్కువగా ఆధారపడుతుందని యునైటెడ్ స్టేట్స్కు తెలుసు" అని US ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపారు. ఉత్తర కొరియా ఆధీనంలోని బృందాలు గత కొన్నేళ్లుగా హ్యాకింగ్లతో అక్కడి ప్రభుత్వానికి అవసరమైన నిధులను సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.
ఉత్తర కొరియా యొక్క హ్యాకింగ్ కార్యక్రమాలను 1990ల మధ్యకాలం నుండి అమలు చేస్తోందనీ మరియు గత సంవత్సరాల్లో బ్యూరో 121 అని పిలువబడే 6,000-బలమైన సైబర్ వార్ఫేర్ యూనిట్ను రూపొందించడానికి విస్తరించింది. ఈ యూనిట్ బెలారస్తో సహా అనేక దేశాలలో పనిచేస్తుందట, చైనా, ఇండియా, మలేషియా, రష్యా, US సైనిక నివేదికలు పేర్కొన్నాయి.