Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్ లో కాల్పుల కలకలం..10మంది ఉగ్రవాదులు మృతి

ఈ కాల్పుల్లో తాలిబన్ కమాండర్ మవలావి ముబాషిర్ అలియాస్ మవలావీ అబీదాతోపాటు 10 మంది ఉగ్రవాదులు మరణించారు. 

taliban commander among 10 terrorists killed in clashes with security forces in afghanistan
Author
Hyderabad, First Published Nov 25, 2019, 7:20 AM IST

ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో తాలిబన్ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ కమాండరుతోపాటు 10 మంది ఉగ్రవాదులు మరణించారు. ఆర్చి జిల్లా క్వారలుక్ ప్రాంతంలో తాలిబన్ ఉగ్రవాదులకు, ఆఫ్ఘాన్ భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తాలిబన్ కమాండర్ మవలావి ముబాషిర్ అలియాస్ మవలావీ అబీదాతోపాటు 10 మంది ఉగ్రవాదులు మరణించారు. 

ఈ కాల్పుల్లో ఐదుగురు ఆఫ్ఘాన్ సెక్యూరిటీ గార్డులు కూడా గాయపడ్డారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులతో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios