Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ లో ఉచిత గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట, 11 మంది మృతి, అనేకమందికి గాయాలు..

పాకిస్తాన్ లో ఉచిత గోధుమపిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాటల్లో 11మంది చనిపోయారు. ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేయడానికి ఈ స్కీం ప్రవేశపెట్టబడింది. 

Stampede During Free Flour Distribution in Pakistan, 11 Killed - bsb
Author
First Published Mar 30, 2023, 6:53 AM IST

పాకిస్తాన్ : ఆహారం కోసం ఒక్కసారిగా ఎగబడడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. కొద్దిరోజులుగా అక్కడ సామాన్య ప్రజల పరిస్థితి దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ జిల్లాల్లో ఉచితంగా గోధుమపిండి పంపిణీ చేసే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇటీవలి కాలంలో 11 మంది సామాన్య జనాలు ప్రాణాలు కోల్పోయారు.  

పాకిస్తాన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు  దక్షిణ పంజాబ్ లోని బహfవల్పూర్, ముజఫర్గడ్, ఒకారా, పసైలాబాద్, జహానియాన్, ముల్తాన్ జిల్లాలోని కేంద్రాల వద్ద ఇటీవల కాలంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కేంద్రాల్లో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 11 మంది మృత్యువాత పడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా వెల్లడించారు.

బిగ్ బ్రేకింగ్ .. పోప్ ఫ్రాన్సిస్ కు తీవ్ర అస్తవ్యస్త.. ఆసుపత్రికి తరలింపు..

ఇప్పటికే నగదు కొలతతో అనేక ఇబ్బందులు పడుతోంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ప్రావిన్స్ లోని పేదల కోసం ఉచిత గోధుమ పిండి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఉచిత గోధుమ పిండి కేంద్రాల వద్దకి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.  దీంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఇవే ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని పోలీసులు అధికారులు తెలుపుతున్నారు.

ఇదిలావుండగా, రద్దీని తగ్గించడానికి, ప్రజలకు అసౌకర్యాన్ని తగ్గించడానికి బుధవారం ఉదయం 6 గంటలకు ఉచిత పిండి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు పంజాబ్ కేర్‌టేకర్ ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ ప్రకటించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో, ప్రాంతీయ మంత్రులు, కార్యదర్శులు రాబోయే మూడు రోజులు కేటాయించిన జిల్లాల్లో విధులు నిర్వహించాలని, గోధుమ పిండి పంపిణీ కేంద్రాలను సందర్శించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు.

పంజాబ్‌లోని వివిధ నగరాల్లో సంభవించిన వ్యాధులు, మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ప్రజలకు వారి సౌలభ్యం కోసం మెరుగైన మార్గనిర్దేశం చేయాలని, వాటిని అమలయ్యేలా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉచిత పిండి కేంద్రాలలో పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ప్రభుత్వం తప్పుగా నిర్వహించడాన్ని ఖండించారు ప్రజల మరణాలకు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నఖ్వీ బాధ్యులని ఆరోపించారు. ‘దొంగల ప్రభుత్వం’ ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చిందని, దీంతో ఉచిత పిండిని సేకరించేందుకు ఎగబడి చనిపోతున్నారని అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios