శ్రీలంక నౌకాదళంతో కలిసి విన్యాసాలు.. కొలంబోకి చేరుకున్న భారత నౌకలు
విదేశీ శిక్షణలో భాగంగా భారత నౌకాదళంలోని (indian air force) 1వ ట్రైనింగ్ స్క్వాడ్రన్కు చెందిన నౌకలు అక్టోంబర్ 24 నుంచి 28 వరకు శ్రీలంకను (sri lanka) సందర్శిస్తున్నాయి. ఇండియన్ నేవీ షిప్స్ మాగర్, శార్దూల్లు కూడా ఈ బృందంలో వున్నాయి
విదేశీ శిక్షణలో భాగంగా భారత నౌకాదళంలోని (indian air force) 1వ ట్రైనింగ్ స్క్వాడ్రన్కు చెందిన నౌకలు అక్టోంబర్ 24 నుంచి 28 వరకు శ్రీలంకను (sri lanka) సందర్శిస్తున్నాయి. ఇండియన్ నేవీ షిప్స్ మాగర్, శార్దూల్లు కూడా ఈ బృందంలో వున్నాయి.
సీనియర్ ఆఫీసర్, 1 వ ట్రైనింగ్ స్క్వాడ్రన్లు కొలంబో వచ్చారు. అయితే ఇండియన్ నేవీకి చెందిన సుజాత, తరంగిణి, సుదర్శిని విక్రమ్లు 24 అక్టోబర్ నాడు ట్రింకోమలీ నౌకాశ్రయంలోకి ప్రవేశించాయి.
ఈ పర్యటనలో నౌకలు ద్వైపాక్షిక శిక్షణతో పాటు సెయిల్ ట్రైనింగ్ క్యాప్సూల్స్ను శ్రీలంక నేవీ కోసం చేపట్టాయి. సంబంధిత నౌకాశ్రయాల నుండి బయలుదేరే ముందు శ్రీలంక నావికాదళానికి చెందిన నౌకలతో జాయింట్ ఎక్సర్సైజ్లో కూడా ఈ నౌకలు పాల్గొంటాయి.