సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి..
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన బస్సు సౌదీ అరేబియాలో వంతెనను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు.
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓక్బాత్ షియార్లో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు వంతెనను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు. సౌదీ వార్తాపత్రిక ఓకాజ్ ప్రకారం .. ఈ ప్రమాదం అసిర్ ప్రావిన్స్ , అభా నగరం మధ్య వెళ్లే రహదారిపై సోమవారం జరిగింది. వార్తాపత్రిక ప్రకారం..బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా బస్సు వంతెనను ఢీకొట్టడం, బోల్తా కొట్టడం ఆ వెంటనే బస్సు ఒక్కసారిగా మంటలు చేలారేగాయని పేర్కొంది.
సివిల్ డిఫెన్స్ , సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ బృందాలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని ఓకాజ్ నివేదించింది. మృతులు, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. బస్సు పూర్తిగా దగ్ధమైన దృశ్యాలు టీవీలో ప్రసారమయ్యాయి. యెమెన్ సరిహద్దులోని నైరుతి అసిర్ ప్రావిన్స్లో వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.