సౌదీ అరేబియా ఫుట్బాల్ జట్టు ప్రయాణిస్తున్న విమానంలో మంటలు
తృటితో పెను ప్రమాదం నుండి తప్పించుకున్న ఆటగాళ్లు
రష్యాలో జరుగుతున్న ఫుట్బాల్ ప్రపంచకప్ లో పాల్గొన్న సౌదీ అరెబియా జట్టు సభ్యులు ఫెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. వీరు ప్రయాణిస్తున్న ఎయిర్బస్ విమానం ప్రమాదంలో చిక్కుకుంది. అయితే ఈ ప్రమాదం నుండి ఆటగాళ్లతో పాటు సిబ్బంది కూడా సురక్షితంగా బైటపడ్డారు.
వరల్డ్ కప్ లో భాగంగా సౌదీ ఆటగాళ్లు ఓ ప్రత్యేక విమానంలో రష్యాలోని రాస్తోక్ కు వెళుతుండగా విమానంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. విమానం ఆకాశంలో ఉండగానే ఓ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆటగాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే దీన్ని గమనించిన ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో విమానంలోని ఆటగాళ్లు, సిబ్బంది ఫెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
ఈ ప్రమాదంపై రష్యా ఎయిర్లైన్స్ అధికారులు స్పందించారు. ఏదైనా పక్షి ఢీకొనడం వల్లే ఇలా మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరిపి తదుపరి వివరాలు తెలియజేస్తామని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.
📹 PASSENGER FOOTAGE: Watch #KSA plane engine catching fire as they land in Rostov-on-Don for their #WorldCup matchday 2 game against #URU . pic.twitter.com/Yq3QQ1MtZ1
— Ahdaaf (@ahdaafme) June 18, 2018