హస్తకళలు, క్రాఫ్ట్ కళాకారులను ప్రోత్సహించే అవకాశాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడూ వదులుకోరు. G20 సమ్మిట్‌లో పాల్గొనడానికి  ప్రధాని మోడీ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకులకు భారతీయ కళలు , సంస్కృతికి సంబంధించిన వెలకట్టలేని బహుమతిని అందించారు. వాటిని ఒకసారి పరిశీలిద్దాం

PM Modi Gift To World Leader: హస్తకళలు, క్రాఫ్ట్ కళాకారులను ప్రోత్సహించే అవకాశాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడూ వదులుకోరు. G20 సమ్మిట్‌లో పాల్గొనడానికి ప్రధాని మోడీ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకులకు భారతీయ కళలు , సంస్కృతికి సంబంధించిన వెలకట్టలేని బహుమతిని అందించారు. వాటిని ఒకసారి పరిశీలిద్దాం

యునైటెడ్ కింగ్‌డమ్ అధినేత కోసం మాతా నీ పచ్చడి (అహ్మదాబాద్).

బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు మాటా నీ పచ్చడి బహుమతిని అందించారు. మాతా నీ పచ్చడి అనేది గుజరాత్‌కు చెందిన హస్తకళ రూపం(చేతితో తయారు చేసిన వస్త్రం). ఇందులో మాతృ దేవత,పుణ్యక్షేత్రాల నేపధ్యంతో రూపొందించారు. మాతా నీ పచ్చడి అనేది గుజరాతీ భాష పదం 'మాత' అంటే 'మాతృ దేవత', 'ని' అంటే 'చెందినది' మరియు 'పచేడి' అంటే 'నేపథ్యం' అని అర్థం. జనపద కథల ఆధారంగా ఈ కళారూపాన్ని రూపొందిస్తారు. వాగ్రిస్ అనే సచార తెగవారు ఈ హస్తకళలో నిష్ణార్ధులు. ఈ హస్తకళరూపంలో దేవి లేదా శక్తి రూపాల ఇతిహాసాలను కూడా ఇందులో వర్ణిస్తారు. 

Scroll to load tweet…

యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ కోసం కాంగ్రా మినియేచర్ పెయింటింగ్స్ (కంగ్రా).

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్ పెయింటింగ్ ఇచ్చారు. కాంగ్రా మినియేచర్ పెయింటింగ్‌లు సాధారణంగా 'శృంగర్ రస' లేదా సహజ నేపథ్యంలో ప్రేమను చిత్రీకరిస్తాయి. దైవభక్తి,ప్రేమ భావన ప్రధాన ఇతివృత్తంతో ఈ పెయింటింగ్స్ ను రూపొందిస్తారు. 18వ శతాబ్దపు మొదటి అర్ధ భాగంలో ఈ చిత్రకళ అభివద్ది చెందింది. మొఘల్ చిత్రకళలో శిక్షణ పొందిన కాశ్మీరీ చిత్రకారుల కుటుంబం గులేర్ రాజా దలీప్ సింగ్ ఆస్థానంలో ఆశ్రయం పొందినప్పుడు ఈ కళ ఉద్భవించింది. మహారాజా సన్సార్ చంద్ కటోచ్ (r.1776-1824) కాలంలో కాంగ్రా కళ అత్యున్నత స్థాయికి చేరుకుంది.ఈ సున్నితమైన పెయింటింగ్‌లను నేడు హిమాంచల్ ప్రదేశ్‌కు చెందిన మాస్టర్ పెయింటర్లు సహజ రంగులను ఉపయోగించి తయారు చేశారు.

Scroll to load tweet…

ఆస్ట్రేలియా అధినేతకు బహుమతిగా పిథోరా (ఛోటా ఉదయపూర్).

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ 'పిథోరా'ను బహుమతిగా ఇచ్చారు. పిథోరా అనేది గుజరాత్‌లోని ఛోటా ఉదయపూర్‌ చెందిన జానపదకళ. రథ్వా అనే కళాకారుల వీటిని రూపొందిస్తారు.గుజరాత్‌లోని అపారమైన సంపన్నమైన జానపద, గిరిజన కళల సంస్కృతిని ఉదహరిస్తూ ఎప్పటికప్పుడు మారుతున్న తత్వానికి ఇది సజీవ నిదర్శనం.ఈ పెయింటింగ్స్ లో గిరిజనుల సామాజిక, సాంస్కృతిక, పౌరాణిక జీవితం, నమ్మకాలను ప్రతిబింబించేలా రూపొందిస్తారు. ఇవి కుడ్యచిత్రంగా ఒక పిథోరాకు సాంస్కృతిక మానవ శాస్త్రం యొక్క వార్షికోత్సవాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పెయింటింగ్‌లు ఆస్ట్రేలియాలోని స్వదేశీ కమ్యూనిటీల నుండి వచ్చిన ఆదిమ డాట్ పెయింటింగ్‌తో పోలిక ఉంటుంది. 

Scroll to load tweet…

ఇటలీ అధినేతకు బహుమతిగా పటాన్ పటోలా దుపట్టా (స్కార్ఫ్): 

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి పటాన్ పటోలా కండువా కప్పారు. ఉత్తర గుజరాత్‌లోని పటాన్ ప్రాంతంలో సాల్వి కుటుంబాలు రూపొందించిన కళరూపం పటాన్ పటోలా వస్త్రం. ఇందులో ఉపయోగించే రంగులు చాలా కళాత్మకంగా ఉంటాయి.పటోలే అనేది సంస్కృత పదం. దీనికి అర్థం పట్టు లేదా పట్టు వస్త్రం. 11వ శతాబ్దంలో నిర్మించిన పటాన్‌లోని మెట్ల బావి అయిన 'రాణి కి వావ్' నుండి ప్రేరణ పొంది.. దీనిని అభివ్రుద్ది చేసినట్టు భావిస్తారు. పటాన్ పటోలా దుపట్టా ను చెక్కతో చేసిన 'సడేలి' అనే పెట్టెలో పెట్టి రూపొందిస్తారు. 

Scroll to load tweet…

ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్ నేతలకు బహుమతిగా అగేట్ బౌల్ ఆఫ్ కచ్ :

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని కచ్ నుండి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌లకు 'అగేట్ బౌల్' బహుమతిగా ఇచ్చారు. గుజరాత్ అగేట్ క్రాఫ్ట్‌కు ప్రసిద్ధి చెందింది. చాల్సెడోనిక్-సిలికాతో రూపొందించిన పాక్షిక(అర్ధ)విలువైన రాయి. నది వెంబడి ఉన్న రాజ్‌పిప్లా , రతన్‌పూర్ భూగర్భ గనులలో ఈ విలువైన రాయి లభ్యమవుతోంది. ఈ రాయితో వివిధ రకాల అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన హస్తకళాకారులు ఈ కళాఖండాలను రూపొందిస్తారు. అందుకే వీటిని ప్రజాదరణ ఎక్కువ.ఈ విలువైన సాంప్రదాయ క్రాఫ్ట్ సింధు లోయ నాగరికత కాలం నుండి తరతరాలుగా చేతివృత్తుల ద్వారా అందించబడుతోంది. ప్రస్తుతం ఖంబత్ అనే కళాకారులు వీటిని తయారు చేస్తున్నాు. వీటిని గృహాలంకరణ వస్తువులు, ఫ్యాషన్ ఆభరణాలుగా చూడవచ్చు.

Scroll to load tweet…

ఇండోనేషియా నేతకు వెండి గిన్నె( సూరత్) 

ఆతిథ్య ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు గుజరాత్‌లోని సూరత్ నుండి వెండి శాలువను మరియు హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ నుండి శాలువాను ప్రధాని మోదీ బహూకరించారు. స్వచ్ఛమైన వెండితో ప్రత్యేకంగా రూపొందించబడిన గిన్నె.ఇది గుజరాత్‌లోని సూరత్ ప్రాంతంలోని సాంప్రదాయ, అత్యంత నైపుణ్యం కలిగిన లోహ కళాకారులచే రూపొందించబడింది. ఈ కళరూపానికి శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. ఈ వెండి కళా రూపాన్ని తయారు చేయడం చాలా క్లిష్టతరం. సహనం, నైపుణ్యం కలిగిన చేతిపని వారు చాతుర్యం, సృజనాత్మకతతో తయారు చేస్తారు. ఈ అద్భుతమైన రూపాన్ని సమకాలీన, సాంప్రదాయ పద్దతులకు జోడించి రూపొందిస్తారు.

కిన్నౌరి శాలువ (కిన్నౌర్)

కిన్నౌరి శాలువ .. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా ప్రత్యేకత.ఈ ప్రాంతంలో ఉన్ని మిల్లింగ్ , వస్త్రాల తయారీదారులు రూపొందించే పురాతన సంప్రదాయ కళ. దీని రూపకల్పనలో మధ్య ఆసియా, టిబెట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వెఫ్ట్ టెక్నిక్ ఉపయోగించి శాలువను తయారు చేశారు. నాటింగ్ పద్ధతిని ఉపయోగించి రంగులు అద్దుతారు.