Pakistan PM: భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ నూతన పీఎం షెహబాజ్ షరీఫ్ లేఖ రాశారు. ఈ లేఖలో భారత్తో శాంతియుత సంబంధాలు, కశ్మీర్ సమస్యల గురించి ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పాక్ ప్రధాని తెలిపారు.
Pakistan PM: భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ నూతన పీఎం షెహబాజ్ షరీఫ్ లేఖ రాశారు. ఈ లేఖలో భారత్తో శాంతియుత సంబంధాలు, కశ్మీర్ సమస్యల గురించి ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పాక్ ప్రధాని తెలిపారు. ఇటీవల.. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గి.. తర్వాత పాక్ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఈ సందర్బంగా.. పాక్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్కు అభినందనలు తెలుపుతూ.. భారత ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ లేఖలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.
"పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా ఎన్నికైనందుకు హెచ్.ఈ. మియాన్ ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్కు అభినందనలు. ఉగ్రవాదం లేని శాంతి, స్థిరత్వాన్ని భారతదేశం కోరుకుంటుంది, తద్వారా మన అభివృద్ధి సవాళ్లపై దృష్టి సారించి, మన ప్రజల శ్రేయస్సు ను నిర్ధారించగలము. ," అని ఆయన ఏప్రిల్ 11న ట్వీట్ చేశారు. కాగా, ఈ లేఖపై పాక్ ప్రధాని స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ భారతదేశంతో శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుంటుందని అన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న నెలకొన్న జమ్ముకశ్మీర్తో సహా ఇతర వివాదాలను శాంతియుతంగా పరిష్కారించుకోవడం కోసం తమ ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు పేర్కొన్నాడు.
ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ త్యాగం అందరికీ తెలిసిందేనని అన్నారు. శాంతి కోసం పాటుపడాలని అన్నారు. సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక, ఆర్థికాభివృద్ధి గురించి ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందని షెహబాజ్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ త్యాగం అందరికీ తెలిసిందే. శాంతిని కాపాడుకుందాం.. సామాజిక-ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడదాం. అని పాక్ ప్రధాని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. పుల్వామా ఉగ్రదాడికి ప్రతి స్పందనగా 2019లో పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత భారత్, పాక్ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
అనంతరం ఆగస్టు 2019లో జమ్ముకశ్మీర్కు ప్రత్యేక అధికారాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టికల్ 370 రద్దు చేయడం, అలాగే.. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు భారతదేశం ప్రకటించిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్తాన్తో భారత్ నిర్మాణాత్మక సంబంధాలను కోరుకుంటోందని ఇటీవలే స్పష్టం చేశారు. పాకిస్థాన్తో సాధారణ పొరుగుదేశాల సంబంధాలను భారత్ కోరుకుంటుందని, ఏదైనా ఉంటే, ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో ద్వైపాక్షికంగా, శాంతియుతంగా సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని ప్రభుత్వ స్థిరమైన వైఖరిని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ఖాన్ను అధికారం నుంచి తొలగించిన మరసటి రోజు ఏప్రిల్ 11న పాకిస్థాన్ పార్లమెంట్ షరీఫ్ను దేశ 23వ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.
