HIJAB ROW: బెహ్రెయిన్ లో చాలా కాలంగా నడుస్తోన్న లాంతర్స్ అనే భారతీయ రెస్టారెంట్‌ ను స్థానిక అధికారులు మూసేశారు. హిజాబ్ ధరించిన మహిళను లోనికి రానివ్వకపోవడమే దీనికి కారణం. బహ్రెయిన్‌లోని అడ్లియాలో ఈ ఘటన జరిగింది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించరాదన్న కర్ణాటక బీజేపీ ప్రభుత్వ ఉత్తర్వులపై దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగడం, చివరికి కర్ణాటక హైకోర్టు కూడా హిజాబ్ రద్దును సమర్థించడం తెలిసిందే.   

HIJAB ROW:  ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో చ‌ర్చ‌నీయ‌మైన ఆంశం హిజాబ్ వివాదం. తొలుత కర్ణాట‌క‌లో ప్రారంభ‌మైన ఈ వివాదం.. క్ర‌మంగా దేశ‌వ్యాప్తమైంది. చివ‌రికి క‌ర్ణాట‌క హైకోర్టు క‌లుగ‌జేసుకుని.. కర్ణాటక బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించడం తెలిసిందే. కాగా ఇప్పుడు కఠిన ఇస్లామిక్ చట్టాలకు నెలవైన గల్ఫ్ దేశాల్లో హిజాబ్ గొడవ మొదలైంది.. అది కూడా బహ్రెయిన్‌లో భారత ప్రవాసులచే న‌డ‌ప‌బ‌డుతున్న రెస్టారెంట్ లో హిజాబ్ వివాద ఘటన చోటుచేసుకుంది.  దీంతో అక్కడి ప్రభుత్వం ఆ రెస్టారెంట్ ను మూసివేస్తున్న‌ట్టు సంచలన నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఘ‌ట‌న బహ్రెయిన్‌లోని అడ్లియాలో ఈ ఘటన జరిగింది.

వివరాలోకెళ్తే.. బహ్రెయిన్‌లోని అడ్లియాలో 1987 నుంచి లాంతర్స్ అనే భారతీయ రెస్టారెంట్ నడుస్తోంది. అయితే..  ఇటీవల ఒక మహిళ ( హిజాబ్) ముసుగు ధరించి రెస్టారెంట్‌కు వచ్చింది. దీంతో అక్కడి సిబ్బంది ఆమెను రెస్టారెంట్‌లోకి అనుమతించలేదు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

దీంతో బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (బీటీఈఏ) అధికారులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. పర్యాటక ఔట్‌లెట్లన్నీ తప్పక తమ దేశ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ‘ప్రజల పట్ల వివక్ష చూపే అన్ని చర్యలను మేం తిరస్కరిస్తాం. ముఖ్యంగా తమ జాతీయ గుర్తింపునకు సంబంధించిన వివక్షను తీవ్రంగా పరిగణిస్తాం’ అని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.

అలాగే నిబంధనలు ఉల్లంఘించిన ఇండియన్‌ రెస్టారెంట్‌పై దర్యాప్తు జరిపి చర్యలు చేపట్టారు. దీంతో ఆ రెస్టారెంట్‌ను మూసివేశారు. కాగా, ఈ ఘటనపై ఆ భారతీయ రెస్టారెంట్‌ క్షమాపణలు చెప్పింది. “మేము గ‌త 35 సంవత్సరాలుగా ఈ అందమైన రాజ్యంలో నివసిస్తున్న అన్ని దేశాల నుండి మా  వినియోగ దారులకు సేవ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ రెస్టారెంట్ ను  తమ కుటుంబంలా.. ఇంట్లో ఉన్న‌ట్టు  అనుభూతి చెందుతారు. ”అని రెస్టారెంట్ పేర్కొంది. ఈ చ‌ర్య‌కు బాధ్యులైన డ్యూటీ మేనేజర్‌ను తొలగించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.