Asianet News TeluguAsianet News Telugu

హిందూ మహాసముద్రంలో చైనా షిప్ గల్లంతు.. డ్రాగన్ దేశానికి భారత్ సాయం

హిందూ మహాసముద్రం లో చైనాకు చెందిన మత్స్యకార నౌక బోల్తా పడింది. బోల్తా పడిన చైనీస్ ఫిషింగ్ ఓడను రక్షించేందుకు భారత్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో భారత నావికాదళం తన విమానాన్ని మోహరించింది. హిందూ మహాసముద్రంలో మునిగిపోయిన చైనా నౌక, ప్రజలను రక్షించేందుకు నౌకాదళం ముందుకు వచ్చింది
 

Indian Navy deploys aircraft to rescue 39 crew on Chinese ship that sank KRJ
Author
First Published May 18, 2023, 11:51 PM IST

Chinese Ship Capsized: హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన మత్స్యకార నౌక బోల్తా పడింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 39 మంది గల్లంతయ్యారు. నేటీకీ కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. బాధితుల జాడ కోసం సాయం చేయాలని పొరుగుదేశాలను చైనా అభ్యర్థించింది. భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, మాల్దీవులు, ఫిలిప్పీన్స్‌, ఇతర దేశాలకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.

చైనాకు భారత్ సాయం 

ఈ క్రమంలో చైనాకు సాయం చేయడానికి భారత్ ముందుకు వచ్చింది. మునిగిపోయిన చైనా నౌకను అన్వేషించడానికి భారత నావికాదళం తన P-81 సముద్ర గస్తీ విమానంలో ఒకదానిని మోహరించింది. బుధవారం (మే 17) ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ P-81 విమానం ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, మునిగిపోయిన ఓడకు సంబంధించిన అనేక అంశాలను గుర్తించిందని నేవీ తెలిపింది.

మే 17న చైనా ఫిషింగ్ నౌక లూ పెంగ్ యువాన్ 028 మునిగిపోయిందన్న వార్త అందుకున్న భారత నావికాదళం సత్వర చర్యలు చేపట్టి దాదాపు 900 నాటికల్ మైళ్ల దూరంలోని దక్షిణ హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన నిఘా విమానాన్ని మోహరించినట్లు నేవీ తెలిపింది. మునిగిపోయిన చైనా నౌకలో చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ పౌరులు ఉన్నారు.

PLA (నేవీ) అభ్యర్థనకు తక్షణ ప్రతిస్పందనగా, ఇండియన్ నేవీ సంఘటనా స్థలానికి సెర్చ్ అండ్ రెస్క్యూ పరికరాలను మోహరించినట్లు భారత నావికాదళం తెలిపింది. ఇండియన్ నేవీ యూనిట్లు ఆ ప్రాంతంలోని ఇతర యూనిట్లతో సెర్చ్ అండ్ రెస్క్యూ  ప్రయత్నాలను సమన్వయం చేశాయి .  PLA నేవీ యుద్ధనౌకలకు అక్కడికక్కడే మార్గనిర్దేశం చేశాయి. సముద్రంలో భద్రతను నిర్ధారించడంలో విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా భారత్ బాధ్యతను నెరవేర్చుతోంది.

ఆస్ట్రేలియా కూడా

తూర్పు లడఖ్ సరిహద్దులో చైనాతో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య భారత నావికాదళం చైనాకు సహాయం చేసింది. సెర్చ్ , రెస్క్యూ ప్రయత్నాలలో సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి ఇండియన్ నేవీని మోహరించినట్లు నావికాదళం తెలిపింది. సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రయత్నాలలో ఆస్ట్రేలియా కూడా సహాయాన్ని అందించింది. పొరుగు దేశాలు చైనాతో కలిసి సంయుక్త రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తాయని, ప్రాణాలను రక్షించే ఆశను వదులుకోవద్దనిచైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios