Russia Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్‌లుశత్రుత్వాన్ని త‌క్ష‌ణ‌మే ఆపాల‌ని, ఇందుకోసం  ప్రత్యక్ష చర్చలు జరపాలని భారత్  పిలుపునిచ్చింది. ఇరుదేశ‌ల‌తో  భార‌త్ కు స‌త్సంబంధాలున్నాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్ స‌మావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రాల సార్వభౌమాధికారం,  ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరాన్ని UN రాయబారిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర అన్నారు. 

Russia Ukraine Crisis:  గ‌త రెండు వారాలుగా ఉక్రెయిన్ లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. నిత్యం సైరన్ల మోత మోగుతున్నది. దేశ రాజ‌ధాని కీవ్ ను కైవ‌సం చేసుకోవాలనీ ర‌ష్యా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో రాజ‌ధాని శివార్లలో రష్యా, ఉక్రెయిన్‌ బలగాల మధ్య పోరాటం సాగుతున్నది. మరింత మందిని తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం రష్యా దాడుల్లో 20కిపైగా ఉక్రెయిన్‌ పౌరులు చనిపోయారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 636 మంది చనిపోయినట్టు ఐరాస కూడా ధ్రువీకరించింది. అందులో 46 మంది చిన్నారులు ఉన్నట్టు ఐరాస తెలిపింది

రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని త‌క్ష‌ణ‌మే ఆపాల‌ని, ఇందుకోసం రష్యా ఉక్రెయిన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు జరపాలని భారత్ పిలుపునిచ్చింది. ఇరుదేశ‌ల‌తో భార‌త్ కు స‌త్సంబంధాలున్నాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్ స‌మావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరం ఉంద‌ని UN భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర అన్నారు.
 ఉక్రెయిన్, ర‌ష్యాలు త‌క్ష‌ణ‌మే యుధ్దాన్ని ముగించాలని భారతదేశం పిలుపునిచ్చింది. భార‌త‌ప్రధానమంత్రి కాల్పుల విరమణ కోసం పదేపదే పిలుపునిచ్చారని, ప్ర‌త్యేక్ష చ‌ర్చ‌లు దౌత్యం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. దాడుల‌ను విరమించే ఉద్దేశ్యంతో భారతదేశం ప్రత్యక్ష చర్చలకు పిలుపునిస్తోందని అన్నారు.

దాడుల వ‌ల్ల అనేక మంది ప్రాణాలు చేతిలో పెట్టుకుని స‌రిహద్దులు దాటుతున్నార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్‌లో చాలా మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోతున్నార‌ని తెలిపారు. ఇప్పటి వరకు, సుమారు 22,500 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. మా తరలింపు ప్రయత్నాలలో మద్దతు ఇచ్చినందుకు మా భాగస్వాములందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, ” అని ఉక్రెయిన్‌లోని సంఘర్షణ ప్రాంతాల నుండి సురక్షితంగా తిరిగి రావడంలో భారతీయ పౌరులకు అందించిన దాతృత్వం, సహాయం కోసం పోలిష్ విదేశాంగ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో అనేక ఫోన్ సంభాషణలు నిర్వహించారనీ, హింసను తక్షణమే నిలిపివేయాలని సూచించార‌ని తెలిపారు.అలాగే దౌత్య చర్చలు, సంభాషణల మార్గానికి తిరిగి రావడానికి అన్ని వైపుల నుండి సంఘటిత ప్రయత్నాలకు పిలుపునిచ్చారు.తూర్పు ఉక్రెయిన్‌లో కాంటాక్ట్ లైన్‌కు ఇరువైపులా చర్యల ప్యాకేజీని అమలు చేయడంలో OSCE ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని రవీంద్ర చెప్పారు. రెండు వారాలకు పైగా యుద్ధం జ‌ర‌గ‌డంతో ఉక్రెయిన్‌లో మానవ సంక్షోభం సృష్టించ‌బ‌డింది. ఈ క్రమంలో 2 మిలియన్లకు పైగా ఉక్రేనియన్లు తమ దేశం నుండి పారిపోయార‌ని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తుంది. రాబోయే రోజులలో ఆ వారి సంఖ్య పెరుగుతుందని అంచనా.