Medical Assistance to Afghanistan: ఆఫ్ఘనిస్తాన్కు భారత్ వైద్య సహాయం.. ఆరు టన్నుల వైద్యసామాగ్రి పంపిణీ
India Medical Assistance to Afghanistan: ఇటీవల భూకంపంతోప్రభావితమైన ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయం కింద భారతదేశం ఆరు టన్నుల అత్యవసర వైద్య సామాగ్రిని సరఫరా చేసింది. దానిని కాబూల్లోని ఇందిరా గాంధీ ఆసుపత్రికి అప్పగించింది.
India Medical Assistance to Afghanistan: ఇటీవల భూకంపంతో ప్రభావితమైన ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయం కింద భారత్ గురువారం ఆరు టన్నుల అత్యవసర వైద్య సామాగ్రిని సరఫరా చేసింది. దానిని కాబూల్లోని ఇందిరా గాంధీ ఆసుపత్రికి అప్పగించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్కు మనదేశం వైద్య, మందులు వంటి వైద్య సహాయాన్ని సరఫరా చేసింది, ఇందులో ఆరు టన్నుల అవసరమైన మందులు, మెడికల్ పరికారాలు ఉన్నాయి. ఇది భారతదేశం నుండి కొనసాగుతున్న మానవతా సహాయంలో భాగం. దీనిని కాబూల్లోని ఇందిరా గాంధీ ఆసుపత్రికి అప్పగించారు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు సహాయం చేయాలంటూ UN చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా భారతదేశం ఇప్పటివరకు 20 టన్నుల మందులను పంపిణి చేసింది. ఇందులో భాగంగా లైఫ్ సేవింగ్ మెడిసిన్, యాంటీ-టిబి మెడిసిన్, ఐదు లక్షల డోసుల యాంటీ కోవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేసిందని తెలిపింది. ఔషధాల సరుకును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), కాబూల్లోని ఇందిరా గాంధీ చిల్డ్రన్స్ హాస్పిటల్కు అందజేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
భూకంపం నేపథ్యంలో భారతదేశం మొట్టమొదటి సారి ఆప్ఘన్ కు సాయం అందించింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపం దృష్ట్యా.. భారతదేశం ప్రథమ చికిత్సకు సంబంధించిన మెడిసన్స్ ను రెండు విమానాల ద్వారా 28 టన్నుల సహాయ సామగ్రిని సరఫరా చేసినట్లు ప్రకటన పేర్కొంది.
ఇది కాకుండా.. భారతదేశం ఇప్పటివరకు 35 వేల మెట్రిక్ టన్నుల గోధుమల రూపంలో ఆహార సాయాన్ని అందించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశం పంపిన సహాయ సహాయంలో కుటుంబ వినియోగ టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు, చాపలు, ఇతర అత్యవసరమైన పదార్థాలు ఉన్నాయి. ఇటీవల తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో సంభవించిన భూకంపంలో 1,000 మంది మరణించగా, 1,500 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఈ ఉపశమనాన్ని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (UNOCHA), ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP), ఆఫ్ఘనిస్తాన్ యొక్క రెడ్ క్రెసెంట్ సొసైటీకి అప్పగించారు. ఐక్యరాజ్యసమితి సంస్థలతో సమన్వయంతో ఆఫ్ఘనిస్తాన్కు మరిన్ని వైద్య సహాయం, గోధుమలను అందించే ప్రక్రియలో భారతదేశం కూడా ఉంది.
మానవతా సహాయాన్ని సమర్ధవంతంగా సరఫరా చేయడానికి, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో కొనసాగుతున్న సంబంధాలను నిశితంగా పర్యవేక్షించడానికి మరియు సమన్వయం చేయడానికి ప్రయత్నాల దృష్ట్యా ఇటీవల భారత సాంకేతిక బృందం కాబూల్లో మోహరించడం గమనార్హం.