యూకేలోని భారత హైకమిషన్ కార్యాలయంపై భారీ త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలను షేర్ చేస్తూ ‘ఝండా ఊంచా రహే హమారా’ అని నెటిజన్లు క్యాప్షన్స్ పెడుతున్నారు. 

ఖలిస్తానీ మద్దతుదారుల నిరసనల మధ్య లండన్‌లోని భారత హైకమిషన్ భవనంపై మునుపటి కంటే భారీ జాతీయ జెండాను అధికారులు ఆవిష్కరించారు. సోమవారం ఇదే స్థానంలో చిన్న సైజులో భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. మార్చి 19న ఖలిస్తానీ జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు భారత పతాకాన్ని కిందకు లాగిన ఘటన తెలిసిందే. దీంతో భారతీయులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 

బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులకు సుప్రీం షాక్.. ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటుకు అంగీకారం..

కాగా.. తాజాగా హైకమిషన్ భవనంపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసింది. యూకేలోని హైకమిషన్ భవనంపై భారీ త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన ఫొటోలు సోషల్ మీడియాలో యూజర్లు షేర్ చేస్తూ 'ఝండా ఊంచా రహే హమారా' అని రాశారు.

Scroll to load tweet…

ఆదివారం భారత హైకమిషన్ కు సురక్షిత దూరంలో ఉన్న లండన్ మెట్రోపాలిటన్ పోలీసులపై ఖలిస్థాన్ అనుకూల ఆందోళనకారులు నినాదాలు చేస్తూ వాటర్ బాటిల్స్, సిరా విసిరారు. సాయంత్రానికి సుమారు 2 వేల మంది ఆందోళనకారులు అక్కడికి చేరుకుని బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించి పోలీసులను టార్గెట్ చేశారు. నిరసన మరింత తీవ్రమైతే ఘటనా స్థలాన్ని ఖాళీ చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే లండన్ లోని భారత రాయబార కార్యాలయం వద్ద అదనపు బారికేడ్లు, పోలీసులను మోహరించారు. బ్రిటన్ రాజధానిలోని భారత హైకమిషన్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి ,13 మందికి తీవ్ర గాయాలు

ఇదిలా ఉండగా.. ఖలిస్తానీ మద్దతుదారులు భారత జాతీయ పతాకాన్ని కూల్చివేసి, లండన్ లోని భారత కాన్సులేట్ ను ధ్వంసం చేసిన కొన్ని రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలోని యూకే హైకమిషన్ వెలుపల అదనపు బారికేడ్లను తొలగించారు. బారికేడ్లను తొలగించినప్పటికీ భద్రత మాత్రం చెక్కు చెదరలేదని అధికారులు చెబుతున్నారు. ‘‘ఇక్కడి బ్రిటిష్ హైకమిషన్ వెలుపల భద్రతా ఏర్పాట్లు చెక్కుచెదరకుండా ఉన్నాయి. అయితే, రాకపోకలకు అడ్డంకులు సృష్టించిన కమిషన్ వైపు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాం’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు ‘టైమ్స్ నౌ’తో తెలిపారు.

'కుక్క మాంసం' వివాదం.. అస్సాం అసెంబ్లీలో దూమరం.. మహారాష్ట్ర సీఎంకు హిమంత బిస్వా శర్మ లేఖ

యూకేలోని భారత హైకమిషన్ పై దాడి తర్వాత న్యూఢిల్లీలోని సీనియర్ యూకే దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. లండన్ లోని భారత హైకమిషన్ కు వ్యతిరేకంగా వేర్పాటువాద, తీవ్రవాద శక్తులు తీసుకున్న చర్యలపై భారత్ తీవ్ర నిరసనను తెలియజేయడానికి న్యూఢిల్లీలోని సీనియర్ మోస్ట్ యూకే దౌత్యవేత్తను బుధవారం సాయంత్రం పిలిపించినట్లు ఎంఈఏ తెలిపింది.
భారత హైకమిషన్ భద్రతను యూకే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, వేర్పాటువాద ఖలిస్థాన్ జెండాలు ఎగురవేసిన నిరసనకారుల బృందం భారత రాయబార కార్యాలయంపై జరిగిన విధ్వంసం ఆమోదయోగ్యం కాదని బ్రిటన్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.