Dhaka: భారీ వరదలు బంగ్లాదేశ్లో 7.2 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేశాయని క్యరాజ్యసమితి (ఐరాస) వెల్లడించింది. ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) కింద అధికంగా ప్రభావితమైన మూడు జిల్లాల్లోని 34,000 గృహాలకు 85 టన్నుల బలవర్ధక బిస్కెట్లను పంపిణీ చేసినట్టు తెలిపింది.
Bangladesh flash floods: బంగ్లాదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలు సంభవించడంతో లక్షలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. జూన్ 15 సంభవించిన ఆకస్మిక వరదలతో పాటు మేలో ప్రారంభమైన వినాశకరమైన ఆకస్మిక వరదల కారణంగా 7.2 మిలియన్ల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని ఐక్యారాజ్య సమితి (ఐరాస-UN) తెలిపింది. బంగ్లాదేశ్ మీడియా నివేదికల ప్రకారం.. సిల్హెట్, సునమ్గంజ్, మౌలివజార్, హబీగంజ్, నేత్రకోనా ప్రాంతాలు అధికంగా ప్రభావితమయ్యాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం 472,000 మంది ప్రజలను 1,605 సహాయక శిబిరాలకు తరలించింది. వరదల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టిందని యూఎన్వో పేర్కొంది. ఐక్యరాజ్య సమితితో పాటు అనేక NGO భాగస్వాములు బాధిత కుటుంబాలకు ఆహార సహాయం, తాగునీరు, నగదు, అత్యవసర మందులు, నీటి శుద్దీకరణ మాత్రలు,పరిశుభ్రత కిట్లు, విద్యా సహాయాన్ని అందించడం ద్వారా ఈ ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నాయి.
జూలై 2-3 తేదీలలో ఐక్యరాజ్య సమితి చెందిన ఉమ్మడి మిషన్, మానవతా దాతలు, NGO భాగస్వాములు వరద ప్రభావిత జిల్లాలైన సిల్హెట్, సునమ్గంజ్లను సందర్శించారు. యునిసెఫ్ పిల్లలను రక్షించడానికి, సురక్షితమైన నీరు, పోషకాహారం, ఆరోగ్య సేవలు సహా ఇతర సహాయానలు అందించడానికి క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకుంటున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అత్యవసర అవసరాలను తీర్చడానికి $2.8 మిలియన్ల అంతర్గత వనరులను తిరిగి కేటాయించింది. దాదాపు 1 మిలియన్ల మందికి ప్రాణాలను రక్షించే సహాయాన్ని అందించింది. అలాగే, ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) మూడు జిల్లాల్లోని 34,000 గృహాలకు 85 టన్నుల బలవర్ధక బిస్కెట్లను పంపిణీ చేసింది. ఇది కాకుండా, UN పాపులేషన్ ఫండ్ (UNFPA) గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రులను యాక్సెస్ చేయడానికి రిఫరల్ మద్దతును అందించింది. 24/7 అత్యవసర ప్రసూతి సహాయాన్ని అందించడానికి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచింది.
UNFPA గర్భిణీ స్త్రీలు సంస్థాగత ప్రసవం కోసం వేచి ఉన్నప్పుడు వారి కోసం ప్రసూతి నిరీక్షణ గృహాలను కూడా నిర్వహిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బాధిత ప్రజలకు 250,000 నీటి శుద్దీకరణ మాత్రలను అందించింది. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, వరదల స్థాయి కారణంగా, రెస్క్యూ లేదా రిలీఫ్ నుండి తెగిపోయిన ప్రాంతాలు ఇప్పటికీ అందుబాటులోకి రాని ప్రాంతాలు ఉన్నాయని ఐరాస తెలిపింది. వరద నీరు మెల్లగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. పెద్ద ఎత్తున ఇళ్లకు నష్టం వాటిల్లడంతో షెల్టర్లు నిండిపోయాయి. దీంతో మహిళలు, బాలికలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా, ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 60,000 మంది మహిళలు గర్భిణులు ఉన్నారు. వారిలో 6,500 మంది వచ్చే నెలలో ప్రసవించనున్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు నీట మునిగి పని చేయకపోవటంతో, ఈ స్త్రీలలో చాలా మందికి ఆరోగ్య సంరక్షణ పరిమితంగా లేదా అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు ఇప్పటికే మూడు వారాల పాఠశాల విద్యను కోల్పోయారు. దీనికి తోడూ వారి పుస్తకాలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ పరిస్థితులు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
