హిందూ మహాసముద్రంలో కుప్పకూలిన చైనా రాకెట్: ఊపిరి పీల్చుకొన్న శాస్త్రవేత్తలు
చైనా రాకెట్ భూమిపై ఆదివారం నాడు కుప్పకూలింది. ఆదివారం నాడు భూ వాతావరణంలోకి రాకెట్ ప్రవేశించింది. ఇవాళ ఉదయం హిందూ మహాసముద్రంలో ఈ రాకెట్ కుప్పకూలింది. 12 టన్నుల బరువున్న రాకెట్ హిందూ మహాసముద్రంలో కుప్పకూలడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు.
వాషింగ్టన్: చైనా రాకెట్ భూమిపై ఆదివారం నాడు కుప్పకూలింది. ఆదివారం నాడు భూ వాతావరణంలోకి రాకెట్ ప్రవేశించింది. ఇవాళ ఉదయం హిందూ మహాసముద్రంలో ఈ రాకెట్ కుప్పకూలింది. 12 టన్నుల బరువున్న రాకెట్ హిందూ మహాసముద్రంలో కుప్పకూలడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు.
చైనా యొక్క కొత్త అంతరిక్ష కేంద్రానికి చెందిన మొదటి మాడ్యూల్ ను ఏప్రిల్ 29న భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది లాంగ్ మార్చ్ -5 బి రాకెట్. ఇవాళ ఉదయం రాకెట్ శిథిలాలు హిందూ మహాసముద్రంలో పడ్డాయని చైనా తెలిపింది.భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయానికే రాకెట్ శిథిలమైందని నిపుణులు చెప్పారు. యూఎస్ మిలిటరీ డేటా ప్రకారంగా స్పేస్ ట్రాక్ భూ వాతావరణంలోకి ప్రవేశించిందని ధృవీకరించింది.
లాంగ్ మార్చ్ 5 బి రీ ఎంట్రీని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకోవచ్చు.. రాకెట్ డౌన్ అయిందని యూఎస్ తెలిపింది. చైనా శాస్త్రవేత్తల నియంత్రణ కోల్పోయిన రాకెట్ తిరిగి భూ మార్గంలోకి ప్రవేశించింది. అయితే ఎక్కడ ఈ రాకెట్ కుప్పకూలుతోందోననే ఆందోళన నెలకొంది. భారత్ లేదా తుర్క్ మెనిస్తాన్ లో కూలే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇవాళ ఉదయం హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. ఈ రాకెట్ కుప్పకూలిన భూమికి హానికలగడం చాలా తక్కువేనని చైనా ప్రకటించింది.