సిరియాలో విషాదం.. పడవ బోల్తా..34 మంది దుర్మరణం
సిరియాలో విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో బయలుదేరిన ఓ పడవ గురువారం బోల్తా పడింది. ఈ ఘటనలో 34 మంది మృతి చెందారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు.
సిరియాలో విషాదం చోటుచేసుకుంది. లెబనాన్ నుంచి ఐరోపాకు వెళ్తున్న పడవ గురువారం మధ్యాహ్నం సిరియా తీరంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 34 మందిమరణించారనీ, మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారనిఅధికారులు తెలిపారు.ఈ విషయాన్ని సిరియా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది టార్టస్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది.
ఈ పడవలో ప్రయాణిస్తున్నవారందరూ లెబనాన్ నుంచి ఐరోపాకు వలస వెళ్తున్నారని, అయితే.. వారిలో ఎక్కువ మంది లెబనీస్,సిరియన్లు అనే విషయాన్ని అధికారులు గుర్తించలేదు. అయితే నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీశామని, 20 మందిని రక్షించి చికిత్స కోసం తీరప్రాంత నగరమైన టార్టస్లోని ఆసుపత్రికి తరలించారని సిరియన్ పోర్ట్ అథారిటీ అధిపతి జనరల్ సమీర్ కోబ్రోస్లీని తెలిపారు. అదే సమయంలో
సిరియన్ మెడిటరేనియన్ ద్వీపం అర్వాద్ సమీపంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, బాధితుల కోసం అధికారులు వెతుకుతున్నారని ఆయన చెప్పారు. సమస్యాత్మక లెబనాన్ నుండి సముద్ర మార్గంలో ఐరోపాకు పారిపోవడానికి లెబనీస్, సిరియన్ మరియు పాలస్తీనియన్ల సంఖ్య పెరుగుతున్నందున ఈ సంఘటన చాలా ఘోరమైనదని ఆయన అన్నారు. అయితే..పడవలో మొత్తం ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. ప్రమాద సమయంలో 120 నుండి 150 మంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు
ఆర్థిక సంక్షోభం కారణంగా వేలాది లెబనీస్,సిరియన్లు, పాలస్తీనియన్లు లెబనాన్ నుండి సముద్రం ద్వారా ఐరోపాకు వలస వెళ్తున్నారు.ఒక్క లెబనాన్లోనే పదివేల మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. లెబనీస్ పౌండ్ దాని విలువలో 90% కంటే ఎక్కువ పడిపోయింది, ఇప్పుడు తీవ్ర పేదరికంలో జీవిస్తున్న వేలాది కుటుంబాల కొనుగోలు శక్తిని కోల్పోయాయి. ఇలా బతుకుదెరువు కోసం వలస వెళ్తుంటే.. ఇలాంటి ఘోరమైన ప్రమాదాలకు గురై.. ప్రాణాలు కోల్పోతున్నారు.
లెబనాన్ ఆర్థిక మందగమనం
లెబనాన్ 6 మిలియన్ల జనాభాను కలిగి ఉంది, ఇందులో 1 మిలియన్ సిరియన్ శరణార్థులు ఉన్నారు. లెబనాన్ 2019 చివరి నుండి తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. జనాభాలో మూడు వంతుల కంటే ఎక్కువ మంది పేదరికం అంచున ఉన్నారు. ఏప్రిల్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. లెబనీస్ నేవీతో ఘర్షణ తర్వాత డజన్ల కొద్దీ లెబనీస్, సిరియన్ మరియు పాలస్తీనియన్లు సముద్ర మార్గంలో ఇటలీకి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ఓ పడవ ట్రిపోలీ నౌకాశ్రయం సమీపంలో మునిగిపోయింది, ఇందులో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు.