Asianet News TeluguAsianet News Telugu

బైడెన్ నోట ఇండియన్ మహిళ పేరు: అమెరికాలో తెలుగు మహిళకు కీలక పదవి

ఇండియన్-అమెరికన్ సంతతికి చెందిన రూప పుట్టగుంటను ఫెడరల్ జడ్జిగా నియమించనున్నట్టుగా 
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం నాడు ప్రకటించారు.

Biden Nominates Indian-American Rupa Ranga Puttagunta As Judge Of DC District Court lns
Author
USA, First Published Mar 31, 2021, 11:39 AM IST

వాషింగ్టన్:ఇండియన్-అమెరికన్ సంతతికి చెందిన రూప పుట్టగుంటను ఫెడరల్ జడ్జిగా నియమించనున్నట్టుగా 
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం నాడు ప్రకటించారు.

ఈ పదవికి సుమారు 10 మంది న్యాయ నిపుణుల పేర్లను ప్రతిపాదించారు. వీరిలో రూప పేరు కూడ ఉంది. వాషింగ్టన్ డీసీలోని రెంటల్ హౌసింగ్ కమిషన్ కు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.ఈ అధిక అర్హత గల అభ్యర్ధులు ఫెడరల్ బెంచ్ అమెరికన్ ప్రజల పూర్తి వైవిధ్యాన్ని ప్రతిబింబించాలని అధ్యక్షుడి యొక్క లోతైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.

రూప పుట్టగుంట నియామకాన్ని యూఎస్ సెనేట్ ధృవీకరిస్తే  యూఎస్ డిస్ట్రిక్టట్ కోర్టులో పనిచేసిన  మొదటి ఆసియా అమెరికన్ ఫసిఫిక్ ద్వీపవాసి మహిళ అని వైట్ హౌస్ ప్రకటించింది.2019లో కమిషన్ లో చేరడానికి ముందు ఆమె 2013 నుండి 2019 వరకు సోలో ప్రాక్టీషనర్ గా ఉన్నారు. 2012 నుండి 2013 వరకు ఎల్ఎల్పిలోని డెలానీ మెకిన్నే వద్ద ఆమె అప్పిలేట్ చట్టాన్ని అభ్యసించారు.

2008 నుండి 2010 వరకు డీసీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి విలీయం ఎం. జాక్సన్, అలాగే 2011 నుండి డీసీ కోర్టు ఆఫ్ అప్పీల్స్ యొక్క సీనియర్ న్యాయమూర్తులకు న్యాయ గుమాస్తాగా ఆమె పనిచేశారు.2007లో ఒహియో స్టేట్ మోరిట్జ్ కాలేజీ ఆఫ్ లా నుండి తన జూరిస్ డాక్టర్ డిగ్రీని ఆమె పొందారు.మంగళవారం నాడు ప్రకటించిన ముగ్గురు ఆఫ్రికన్, ఒక ముస్లిం అమెరికన్ ఉన్నారు.

యూఎస్ సెనేట్ ధృవీకరిస్తే న్యాయమూర్తి జాహిద్ ఎన్ ఖురేషీ యూఎస్ చరిత్రలో ముస్లిం అమెరికల్ ముస్లిం ఫెడరల్ న్యాయమూర్తి.పాకిస్తాన్ సంతతికి చెందిన న్యాయమూర్తి ఖురేషీ న్యూజెర్సీ జిల్లాకు యూఎస్ జిల్లా కోర్టుకు జడ్జిగా 2019లో నియమింపబడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios